ఇదే జరిగితే.. మోడీకి మరో ఇబ్బందే!
ప్రధాని నరేంద్ర మోడీకి మరో చిక్కు వచ్చింది. విశ్వగురువుగా ఆయన తన కీర్తిని ప్రపంచ దేశాలకు విస్తరించుకున్న విషయం తెలిసిందే.;

ప్రధాని నరేంద్ర మోడీకి మరో చిక్కు వచ్చింది. విశ్వగురువుగా ఆయన తన కీర్తిని ప్రపంచ దేశాలకు విస్తరించుకున్న విషయం తెలిసిందే. భారత్ను, ప్రధానిని కూడా ఇప్పుడు విశ్వగురువుగా.. పలుదేశాలు చూస్తున్నాయి. అయితే.. రాను రాను.. ఈ ప్రభావం తగ్గుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కెనడా, బంగ్లాదేశ్, చైనా, పాకిస్థాన్ సహా.. పలు దేశాలు.. భారత్ అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతున్నాయి. అంతేకాదు.. వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా భారత విదేశాంగ విధానంపైనా తరచుగా విమర్శలు వస్తున్నాయి. కీలకమైన సందర్భాల్లో భారత్ మౌనంగా వ్యవహరించడాన్ని చాలా వరకు దేశాలు తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కెనడా నుంచి మరో ఊహించని ఉపద్రవం వెంటాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. మోడీకి మరో ఇబ్బంది ఖాయమని పరిశీలకులు చెబుతున్నారు. ఏటా.. జీ-7 దేశాల సదస్సు జరుగుతుంది. జీ-7 దేశాలంటే.. అభివృద్ది చెందిన దేశాలు.
వీటిలో అమెరికా, బ్రిటన్, జపాన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఉన్నాయి. ఈ దేశాలు.. ప్రతి సంవత్సరం భేటీ అయి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై చర్చించి.. అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే.. భారత్కు దీనిలో సభ్యత్వం లేకపోయినా.. ప్రతి సంవత్సరం ఆతిథ్య దేశం ఠం చనుగా ఆహ్వానం పలుకుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ను గుర్తించి.. భారత్ ఇచ్చే సలహాలు, సూచనలను తీసుకుంటుంది.
ఈ సంవత్సరం సమావేశం ఈ నెల 15న కెనడాలో జరగనుంది. అయితే.. భారత్కు-కెనడాకు మధ్య సిక్కు ల విషయంలో వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆహ్వానం దక్కలేదు. వాస్తవానికి నెల రోజుల ముందే.. ఆహ్వానం అందుతుంది. కానీ.. ఈ సారి మాత్రం అందలేదు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. కెనడా మద్దతు దారుగా ఉన్న పాకిస్థాన్కు ఆహ్వానం అందడం.. దాయాది దేశం రెడీకావడం.. ఇదే సమయంలో శాంతిని ప్రవచిస్తున్న భారత్కు ఆహ్వానం లేకపోవడం వంటివి చర్చకు దారితీస్తున్నాయి.