భారత్ కు వచ్చిన మెస్సి.. మధ్యాహ్నం హైదరాబాద్ కు.. రేవంత్ తో మ్యాచ్
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇండియాలో ల్యాండ్ అయ్యారు. కోల్ కతా చేరుకున్న ఆయనకు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ‘మెస్సీ’ అంటూ హోరెత్తించారు.;
అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఇండియాలో ల్యాండ్ అయ్యారు. కోల్ కతా చేరుకున్న ఆయనకు అభిమానులు వేలాదిగా తరలివచ్చి ‘మెస్సీ’ అంటూ హోరెత్తించారు. తెల్లవారుజామున 2.26 నిమిషాలకు కోల్ కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. ఉదయం 11 గంటలకు ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడనున్నాడు.
గోట్ ఇండియా టూరులో భాగంగా మెస్సి భారత్ కు వచ్చాడు. కోల్ కతా విమానాశ్రయంలో మెస్సీకి ఊహించని ఘన స్వాగతం లభించింది. ఇంటర్నేషనల్ అరైవల్స్ కు చెందిన గేట్ 4 వద్ద వేల సంఖ్యలో జనం గుమిగూడారు. మెస్సి, మెస్సి అంటూ నినాదాలు చేశారు. తమ ఫోన్లతో స్టార్ ప్లేయర్ తో ఫొటోలు, వీడియోలు తీశారు. భారీ భద్రత నడుమ వీఐపీ గేట్ ద్వారా మెస్సి బయటకు వెళ్లాడు. ఆయనతోపాటు తన తోటి జట్టు సభ్యులు లూయిస్ సురేజ్, అర్జేంటీనా టీమ్ మేట్ రోడ్రిగో డీపౌల్ కూడా ఉన్నారు..
రాబోయే 72 గంటల పాటు మెస్సి బృందం ఇండియాలోనే గడుపనుంది. కోల్ కతాతోపాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోనూ మెస్సి టూర్ చేయనున్నాడు. సోమవారం రోజు ప్రధాని నరేంద్రమోదీని అర్జెంటీనా ప్లేయర్ మెస్సి కలవనున్నాడు.
అయితే కోల్ కతా విమానాశ్రయంలో అభిమానులకు నిరాశ ఎదురైంది. భారీ జనం వల్ల అతడిని భద్రత మధ్య తీసుకెళ్లారు. ఉదయం 3.30 నిమిషాలకు బ్యాక్ గేట్ ద్వారా అతడిని హోటల్ కు తీసుకెళ్లారు. ఎయిర్ పోర్టు సిబ్బంది మాత్రమే మెస్సిని చూసే అదృష్టం కలిగింది. హయ్యత్ రీజెన్సీ హోటల్ వద్ద భారీ సంఖ్యలో అభిమానులు పోటెత్తారు. మెస్సి.. మెస్సి అంటూ అరిచారు. రూమ్ నంబర్ 730లోకి మెస్సీ చెకిన్ అయ్యాడు. అతడు ఉంటున్న ఏడో అంతస్తు సూట్ ను పూర్తిగా సీల్ చేశారు.
సాల్ట్ లేక్ స్టేడియంలో ఉదయం జరిగే కార్యక్రమంలో మెస్సి పాల్గొంటాడు. ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతాడు. మోహన్ భగాన్ మెస్సి ఆల్ స్టార్స్ వర్సెస్ డైమెండ్ హార్బర్ మెస్సీ ఆల్ స్టార్స్ మ్యాచ్ లో మెస్సి ఆడుతాడు. ఇరు జట్ల ఆటగాళ్లతో మెస్సి ముచ్చటిస్తాడు. అనంతరం సంతోష్ ట్రోఫీ గెలిచిన జట్టుకు సత్కారం.. పిల్లలతో మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటాు. సీఎం మమతా బెనర్జీతోపాటు షారుఖ్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. లేక్ టౌన్ లో 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్ గా మెస్సి ప్రారంభిస్తారు. మధ్యాహ్న 2 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ లో ఆడుతాడు.
మెస్సితో ఫ్లెండ్లీ మ్యాచ్..
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సితో ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఫ్లెండ్లీ మ్యాచ్ లో తలపడున్నారు. దేశం మొత్తం ఈ క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం ఆయన చాన్నాళ్లుగా కఠోర సాధన చేశారు. ‘ఫుట్ బాల్ నాకు ఇష్టమైన ఆట.. టీం స్పిరిట్ ను ప్రదర్శించాల్సిన క్రీడ. తెలంగాణ టీంకు లీడర్ గా నాలుగు కోట్ల ప్రజలను గెలిపించాలన్న తపన నిత్యం నాలో ఉంటుంది’ అంటూ రేవంత్ చెప్పుకొచ్చాడు.