'కొండం'త ఆస్తులు !

తెలంగాణలోని చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు

Update: 2024-04-22 13:54 GMT

తెలంగాణలోని చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సంధర్భంగా అఫిడవిట్ లో పేర్కొన్న ఆయన ఆస్తుల వివరాలు కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి.

తన పేరు మీద రూ.1178.72 కోట్ల ఆస్తులు ఉన్నయని, అలాగే తన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3,203.90 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తన భూములు, భవనాల విలువ రూ.71.35 కోట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆయా పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యధిక ఆస్తులున్న అభ్యర్థి కొండా కావడం విశేషం. గతంలో బీఆర్ఎస్ లో ఉన్న ఆయన పార్టీని వీడి బయటకు వచ్చారు. కాంగ్రెస్ లో చేరతారని అంతా భావించినా ఆయన బీజేపీలోనే ఉండిపోయారు.

Tags:    

Similar News