లోకేష్ లా గానే చిన్ని కూడా మోసగాడు... నాని సంచలన వ్యాఖ్యలు!

వైసీపీ విజయవాడ లోక్ సభ అభ్యర్థి కేశినేని నాని... గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-04-29 04:12 GMT

వైసీపీ విజయవాడ లోక్ సభ అభ్యర్థి కేశినేని నాని... గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఏమాత్రం అవకాశం వచ్చినా.. ప్రధానంగా చంద్రబాబు – లోకేష్ లపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. ఇదే క్రమంలో... విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలోని ఆయన రాజకీయ ప్రత్యర్థి.. సొంత తమ్ముడు కేశినేని చిన్నిపైనా సెటైర్లు పేలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేష్, చిన్నిలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి గతకొన్ని రోజులుగా ఫుల్ జోష్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్న ఆయన... ప్రత్యర్థులపై ఫైరవుతున్నారు. ఈ సమయంలో... కేశినేని ట్రావెల్స్ మూసివేతకు కారణం నారా లోకేషే అంటూ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు తనకు ఎన్నో జరిగాయని తెలిపారు. తనకు అన్నివిధాలా నష్టం జరిగింది కాబట్టి చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తున్నానని చెప్పారు.

Read more!

ఇదే క్రమంలో... బూతులు ఎవరు ఎక్కువ తిడితే వారికే టీడీపీలో పదవులు ఇస్తారు అని విమర్శించిన కేశినేని నాని... టీడీపీ నుంచి బయటకు వచ్చాక తనను బాగా తిట్టించారని.. తన కూతురు శ్వేతపైనా సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టారని ఫైరయ్యరు. ఇదే క్రమంలో... కేశినేని ట్రావెల్స్‌ ను అర్ధాంతరంగా మార్చడం వల్ల ఆర్థికంగా తాను ఇబ్బంది పడ్డట్లు తెలిపారు.

అయితే తాను ఎవరి దగ్గరా అప్పు తీసుకుని ఎగ్గొట్టలేదని స్పష్టంగా చెప్పిన ఆయన... తనకున్న ఆస్తులు అమ్మి అప్పులు కట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయవాడ అభివృద్ధి జరగాలంటే తానే ఎంపీ కావాలని తెలిపారు. ఇదే క్రమంలో... ఈగోతో తాను టీడీపీ నుంచి బయటకు రాలేదని.. చంద్రబాబు లోకేష్ తనను చాలా అవమానించారని.. గత పదేళ్లుగా ఆవేదన ఉందని, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... తన తమ్ముడు కేశినేని చిన్నిపైనా స్పందించారు. ఇందులో భాగంగా... లోకేష్ పెద్ద మోసగాడని, అదే తరహాలో అతనూ మోసగాడని.. వారిద్దరికీ వేవ్ లెంగ్త్ బాగా మ్యాచ్ అయ్యి ఉండొచ్చన్ని అన్నారు. ఇదే క్రమంలో... భవిష్యత్తులో తనకు బినామీగా పనికొస్తాడని లోకేష్ అనుకుని ఉంటాడంటూ నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News