"మా సోషల్ మీడియా సూపర్ స్టార్స్ తో"... జగన్ సెల్ఫీ వైరల్!

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది

Update: 2024-04-23 11:44 GMT

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సమయంలో మంగళవారం వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్‌ కన్వెషన్‌ హాలులో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల మందితో కూడిన వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌ తో సీఎం సంభాషించారు.

అవును... ముందుగా ప్రకటించినట్లుగానే వైసీపీ సోషల్ మీడియ ఇన్ ఫ్ల్యూయెన్సర్ లు, సోషల్ మీడియా ప్రమోటర్స్ మొదలైన వారితో వైఎస్ జగన్ ఈ రోజు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా జనాలు చెప్పిన విషయాలను సావదానంగా వింటూ.. వాటికి రియాక్ట్ అయ్యారు జగన్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ.. రానున్న అతి స్వల్ప కాలంలో వీరి ముందున్న లక్ష్యాలను దిశానిర్ధేశం చేశారు!

జగనన్న మీరు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బతకాలని అన్నది మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అంటూ ఇటీవల.. సోషల్ మీడియా వేదింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి భర్త స్పందించగా... వెంటనే సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోందని తెలిపారు.

Read more!

ఇదే క్రమంలో వైసీపీ సోషల్ మీడియా టీం ని ఉద్దేశించి ప్రసంగించిన జగన్... సోషల్ మీడియా పరంగా ఎవరైనా వేధింపులకు లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని.. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలని సూచించారు. ప్రతివారం తనకు దానిపై రిపోర్టు కావాలని కోరారు. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే.. మనం విజయానికి చేరువగా ఉన్నామని.. వాళ్లు విజయానికి దూరంగా ఉన్నారని అర్ధమని తెలిపారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియ కర్యకర్తలతో హుషారుగా గడిపిన సీఎం జగన్... వారితో దిగిన సెల్ఫీని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోకు "మా సోషల్ మీడియా స్టార్స్..." అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్ వైరల్ గా మారింది!

Tags:    

Similar News