ఐఐటీ విద్యార్థినిపై దారుణం.. హాస్టల్ నుంచి బయటకు వెళితే అత్యాచారం

ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతానికి కారణమైన నేరస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Update: 2024-01-01 03:59 GMT

షాకింగ్ ఉదంతం వారణాసిలో చోటు చేసుకుంది. ఐఐటీ విద్యార్థిని ఒకరు కాలేజీ హాస్టల్ నుంచి స్నేహితురాలితో బయటకు వెళ్లిన వేళ.. బైక్ మీద వచ్చిన ముగ్గురు ఆమెను బలవంతంగా తమతో తీసుకెళ్లి అత్యాచారం చేసిన ఉదంతం కలకలాన్ని రేపుతోంది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. యూపీలోని వారణాసిలో ఐఐటీ విద్యార్థిపై జరిగిన అత్యాచార ఉదంతం కలకలాన్ని రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతానికి కారణమైన నేరస్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

లంక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. బాధితురాలు తన స్నేహితురాలితో కలిసి హాస్టల్ బయటకు వచ్చింది.రాత్రి వేళలో బయటకు వచ్చిన వారు.. రోడ్డు మీద వెళుతుండగా.. బైక్ మీద వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాధితురాలిని బలవంతంగా తమతో తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బాధితురాలి స్నేహితురాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మరోవైపు.. తనను బలవంతంగా లాక్కెళ్లిన సదరు దుండగులు.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తనను వివస్త్ర చేశారని.. వీడియోలు.. ఫోటోలు తీసుకున్నట్లుగా వాపోయింది. తనపై అత్యాచారం జరిగినట్లుగా బాధితురాలు వాపోయింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు కునాల్ పాండే.. ఆనంద్ అలియాస్ అభిషేక్ చౌహాన్..సాక్షం పటేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Tags:    

Similar News