దేశమంతా కేవలం రూ.3వేలతో తిరగండి!
ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి రానున్న ఈ స్కీమ్ ద్వారా వాహనదారులు ₹3,000 చెల్లించి వార్షిక పాస్ పొందవచ్చు.;

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు ఒక గొప్ప శుభవార్తను వెల్లడించింది. ఈసారి స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఫాస్టాగ్ ఆధారిత కొత్త వార్షిక పాస్ ను పరిచయం చేయనుంది. కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశారు.
-ఆగస్టు 15 నుంచి అమల్లోకి.. దేశమంతా కేవలం ₹3,000తో ప్రయాణం!
ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి రానున్న ఈ స్కీమ్ ద్వారా వాహనదారులు ₹3,000 చెల్లించి వార్షిక పాస్ పొందవచ్చు. ఈ పాస్తో దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై ఏదైనా టోల్ ప్లాజా వద్ద ఏకంగా 200 ట్రిప్పులు లేదా 1 సంవత్సరం కాలవ్యవధి ఏది ముందుగా పూర్తి అయినా సరే ప్రయాణించవచ్చు. ఈ పాస్ ప్రత్యేకంగా కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం రూపొందించబడింది.
ప్రయాణదారులకు ప్రయోజనాలు ఇవే:
ఈ కొత్త విధానం వల్ల ప్రయాణదారులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. తక్కువ ఖర్చుతో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణానికి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం నష్టపోకుండా వేగంగా ప్రయాణించగలుగుతారు. 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందిటోల్ ప్లాజాల వద్ద జరిగే చెల్లింపుల వివాదాలు తగ్గుతాయి.రద్దీ తగ్గి సమయం ఆదా అవుతుంది.
- ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?
ఈ స్కీమ్ను వినియోగించుకోవాలనుకునే వారు త్వరలో NHAI, MoRTH అధికారిక వెబ్సైట్లు లేదా రాజ్మార్గ యాత్ర యాప్ ద్వారా యాక్టివేషన్, పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటుంది.
ఈ పాస్ వల్ల దేశంలోని లక్షలాది వాహనదారులకు ప్రయోజనం కలగనుందని, వారి ప్రయాణ అనుభవం మరింత వేగవంతం, సౌకర్యవంతం కానుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
మొత్తంగా చెప్పాలంటే ఈ కొత్త వార్షిక పాస్ పథకం వాహనదారులకు ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా, ప్రయాణ సమయంలో ఎదురయ్యే అవాంతరాలను కూడా నివారించనుంది. టోల్ గేట్ల వద్ద వేచి ఉండే అవసరం లేకుండా నిరవధిక ప్రయాణానికి ఈ పాస్ దోహదం చేయనుంది.