ఎవ‌ర్నీ వ‌ద‌లం.. బాబు వార్నింగ్‌ ఎవ‌రికి..?

కానీ, చంద్ర‌బాబు వ్యూహం వేరే ఉంది. ఆయ‌న వ్యాఖ్యల వెనుక అంత‌రార్థం కూడా వేరేగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.;

Update: 2025-05-30 00:30 GMT
ఎవ‌ర్నీ వ‌ద‌లం.. బాబు వార్నింగ్‌ ఎవ‌రికి..?

మ‌హానాడు వేదిక‌గా .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు విశ్వ‌రూపం చూపించారు. రెండో రోజు బుధ‌వారం సాయంత్రం ఆయ‌న పార్టీకి 13వ సారి జాతీయ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. అనంత‌రం.. సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ సంద‌ర్భంగానే.. అనేక కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌ర్నీ వ‌ద‌ల‌బోమ‌ని.. నేర‌స్తుల‌ను క‌ఠినంగా శిక్షించి తీరుతామ‌ని చెప్పుకొచ్చారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల అంత‌రార్థం అంద‌రికీ తెలిసిందే. వైసీపీ నాయ కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ద్దులు దాటితే శిక్షించి తీరుతామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే.. అంత‌ర్గ‌తంగా చూస్తే మాత్రం మ‌రో కోణం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వైసీపీలోని సాధార‌ణ నాయ‌కు లు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు చంద్ర‌బాబు స్థాయి నాయ‌కుడు ఇంత గ‌ట్టి వార్నింగ్ ఇవ్వాల్సిన అవ‌స రం లేదు. పైగా ఇప్ప‌టికే అనేక మంది నాయ‌కులు.. వివిధ కేసుల్లో చిక్కుకుని జైళ్ల‌కు వెళ్లారు. ఈ నేప థ్యంలో ఇప్ప‌టికి ఉన్న ప‌రిస్థితుల‌ను బ‌ట్టి.. చంద్ర‌బాబు అంత సీరియ‌స్ కామెంట్లు చేసే అవ‌కాశం కూడా లేదు. వివిధ కేసుల్లోఉన్న‌వారికి ప్ర‌స్తుతం బెయిళ్లు కూడా రావ‌డం లేదు.

కానీ, చంద్ర‌బాబు వ్యూహం వేరే ఉంది. ఆయ‌న వ్యాఖ్యల వెనుక అంత‌రార్థం కూడా వేరేగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా ముగ్గురు నాయ‌కుల‌ను ఉద్దేశించి చంద్ర‌బాబు ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. వీరిలో తొలిపేరు మాజీ సీఎం , వైసీపీ అధినేత జ‌గ‌న్‌. ఈయ‌న‌పై ఇప్ప‌టికే మ‌ద్యం కుంభ‌కో ణం కేసు తాలూకు వివాదం ముసురుతోంది. నిజానికి సిట్ చేస్తున్న విచార‌ణ తాలూకు ఫ‌లితంగా జ‌గ‌న్‌ను అరెస్టు చేయాల‌ని అనుకోవ‌డం లేద‌ని తెలిసింది.

ఈ కేసును సిట్ ద్వారా ప‌రిమితం చేస్తే.. జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చేసే వీలుంటుంది. అందుకే.. ఈడీ ద్వారా ఆర్థిక లావాదేవీల‌కు సంబంధించి ఉచ్చు బిగిస్తున్నారు. సో.. బ‌ల‌మైన హెచ్చ‌రిక వెనుక ఇది కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. అదేవిధంగా రెండో నాయ‌కుడు.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆది నుంచి ప్ర‌త్య‌ర్థి అయిన పెద్దిరెడ్డిని.. వ‌దిలేది లేద‌న్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, మూడో నాయ‌కుడు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. త‌న ఓట‌మికి స్కెచ్ గీసింది స‌జ్జ‌లేన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే.. వీరిని దృష్టిలో పెట్టుకునే ఆయ‌న గ‌ట్టి వార్నింగ్ ఇచ్చార‌ని తెలుస్తోంది.

Tags:    

Similar News