రేవంత్ నేనున్నా అసదుద్దీన్ భరోసా !

అభివృద్ధి, మతపరమైన శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని’’ అసదుద్దీన్ స్పష్టం చేశారు.

Update: 2024-05-04 13:01 GMT

తెలంగాణ ప్రభుత్వం త్వరలో పడిపోతుంది అని బీజేపీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు అంటున్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భరోసా ఇచ్చాడు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఐదేళ్ల పాటు ఎలాంటి డోకా లేదు. నేను ప్రజల మధ్యనే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పాను. అభివృద్ధి, మతపరమైన శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని’’ అసదుద్దీన్ స్పష్టం చేశారు.

రేవంత్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పినవారే పడిపోతారని, హైదరాబాద్ నుండి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని, మతపరమైన గొడవలు సృష్టించాలన్నదే మాధవీలత అజెండా అని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు.

రిజర్వేషన్లను తొలగించాలన్నదే బీజేపీ ప్రయత్నిస్తుందని, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు సాధించాలనుకుంటుందని, హైదరాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో మరోసారి పతంగి ఎగురుతుందని, బీజేపీ ఖతం అవుతుందని అసదుద్దీన్ అన్నారు. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో ఎంఐఎం పార్టీని, ఓవైసీ సోదరులను రేవంత్ తీవ్రంగా విమర్శించాడు.

ఆ తరువాత రేవంత్ లండన్ లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు. అనంతరం పాతబస్తీ కార్యక్రమాలలో ఓవైసీ సోదరులతో సన్నిహితంగా మెలిగాడు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలహీన అభ్యర్థిని నిలిపి నామమాత్రపు పోటీ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ కు అసదుద్దీన్ స్నేహ హస్తం అందించడం గమనార్హం.

Tags:    

Similar News