SSR జన్ ఆందోళ‌న్.. శ్వేతాసింగ్ ఉద్య‌మ బాట‌!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడి మరణం కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది

Update: 2024-04-27 13:41 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి తన సోదరుడి మరణం కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆన్‌లైన్ ప్రచారాన్ని ప్రారంభించింది. జూన్ 2020లో సుశాంత్ తన ముంబై అపార్ట్‌మెంట్‌లో విగ‌త జీవి అయ్యాడు. బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడ‌ని కేసు న‌మోదైంది. కొందరు ఆత్మహత్యతో మరణించినట్లు అనుమానించగా, మరికొందరు ఫౌల్ ప్లే అని ఆరోపించారు. చాలా ఏజెన్సీలు ద‌ర్యాప్తు చేసినా కానీ తుది నివేదిక వెలువ‌డ‌లేదు. కోర్టుల్లో తుది తీర్పు కూడా వెలువ‌డ‌లేదు. కానీ ఈ మరణం కేసుపై దర్యాప్తు చేయమని అతడి సోదరి తరచుగా అధికారులను కోరుతూనే ఉంది. ఆమె రోద‌న అర‌ణ్య‌రోద‌న‌గా మారిందని అభిమానులు క‌ల‌త చెందుతున్నారు.

శనివారం నాడు.. శ్వేతా సింగ్ కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో `నానీ 4 SSR జన్ ఆందోళన్` ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ మణికట్టు లేదా నుదిటిపై ఎర్రటి గుడ్డ కట్టుకోవాలని, వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని.. దివంగత నటుడు సుశాంత్ సింగ్‌కి న్యాయం చేయాలని ఏజెన్సీలను అభ్యర్థించాలని శ్వేత కోరారు. తన పోస్ట్ శీర్షికలో కూడా CBI దర్యాప్తును వేగవంతం చేయాలని `సత్యాన్ని బట్టబయలు చేయాలని కోరారు. ``మ‌రో 45రోజుల నాటికి నా సోదరుడు సుశాంత్ మరణించి 4 సంవత్సరాలు పూర్తి అవుతుంది. వారి విచారణను వేగవంతం చేయాలని.. సత్యాన్ని బట్టబయలు చేయమని నేను సిబిఐకి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఐక్యంగా కలిసి నిలుద్దాం. మీ మణికట్టు లేదా నుదిటిపై ఎర్రటి వస్త్రాన్ని కట్టుకోండి.. ఆ క్షణాల‌ను కెమెరాలో బంధించి #Nyay4SSRJanAndolan ఉపయోగించి షేర్ చేయండి`` అని శ్వేతా సింగ్ కీర్తి రాశారు.

పోస్ట్ షేర్ చేసిన వెంటనే అనేక మంది నెటిజ‌నులు దానికి ప్రతిస్పందించారు. SSR కోసం.. న్యాయం కోసం ఆశించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ భయ్యాకి న్యాయం చేయండి. మేము మీతో ఉన్నాము..అని వినియోగదారుల్లో ఒకరు రాశారు. డబ్బు కంటే మానవత్వం గొప్పగా పని చేసే వరకు భారత రాజకీయాలు నిజాన్ని దాచిపెడతాయి! అని మరొకరు వ్యాఖ్యానించారు. 4 సంవత్సరాలు! ఇది నిన్న జరిగినట్లు అనిపిస్తుంది! అని మ‌రొక‌రు వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మార్చిలో కూడా శ్వేత ఒక వీడియో ప్రకటన విడుదల చేసి తన సోదరుడి మరణంపై సీబీఐ విచారణను పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తన సోదరుడు మరణించి 45 నెలలు అవుతున్నా, దర్యాప్తు సంస్థ నుండి తమకు ఇంకా ఎలాంటి అప్‌డేట్ రాలేదని శ్వేత తన స్టేట్‌మెంట్‌లో ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ప్రధాని మోడీ స‌హాయం దర్యాప్తును వేగవంతం చేయడమే కాకుండా `అరుతున్న హృదయాలకు` ఉపశమనం కలిగిస్తుందని శ్వేతా వాదించారు. త‌న లేఖలో ఇలా రాసారు.

``నమస్తే.. నేను శ్వేతా సింగ్ కీర్తిని. నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరిని. మన ప్రధాని మోదీ జీ సాయం కోసం ఈ సందేశాన్ని రికార్డ్ చేస్తున్నాను. భాయ్ మరణించి ఇది 45వ నెల అని నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సీబీఐ నిర్వహిస్తున్న దర్యాప్తు గురించి మాకు ఇంకా ఎలాంటి అప్‌డేట్‌లు తెలియవు. ఈ విషయంలో మీ జోక్యాన్ని నేను ఎక్కువగా అభ్యర్థిస్తున్నాను.. ఎందుకంటే ఒక కుటుంబంగా .. ఒక దేశంగా, మేము ఈ కేసులో చాలా సమాధానాలు లేని ప్రశ్నలతో పోరాడుతున్నాము``అని శ్వేతా సింగ్ కీర్తి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు.

4
Tags:    

Similar News