సౌత్ టచ్.. బాలీవుడ్ బిగ్ స్టార్ ప్లాన్ అదుర్స్..!

ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ ఎప్పుడైనా బాలీవుడ్ పై పైచేయి సాధిస్తుందని ఊహించామా

Update: 2024-05-01 06:30 GMT

ప్రాంతీయ సినిమాగా ఉన్న టాలీవుడ్ ఎప్పుడైనా బాలీవుడ్ పై పైచేయి సాధిస్తుందని ఊహించామా. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసేలా చేశారు మన స్టార్స్. కోవిడ్ వల్ల బాలీవుడ్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడగా సౌత్ సినిమాలు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనాలు చేస్తూ వచ్చాయి. బాహుబలి, కె.జి.ఎఫ్, పుష్ప 1, ఆర్.ఆర్.ఆర్ ఇలా వరుస సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి.

అందుకే అక్కడ స్టార్స్ కూడా సౌత్ సినిమాల మీద ఇక్కడ దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా సౌత్ సినిమాల హంగామా చూసి సౌత్ డైరెక్టర్ తో సినిమా చేశాడు. పఠాన్ తో తిరిగి ఫాం లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ అట్లీ డైరెక్షన్ లో చేసిన జవాన్ తో మరో సూపర్ హిట్ కొట్టాడు. ఇక డుంకీ అంటూ ఇయర్ ఎండింగ్ లో మరో సక్సెస్ అందుకున్నాడు.

వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమాలో పడిన షారుఖ్ ఖాన్ మూడు హిట్లతో సూపర్ ఫాం లోకి వచ్చాడు. అయితే తను తీసే నెక్స్ట్ సినిమా విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉన్నాడని తెలుస్తుంది. సినిమా కథలో సౌత్ టచ్ ఉండేలా ఇక్కడ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడట షారుఖ్. జవాన్ తో సౌత్ లో కూడా సక్సెస్ అందుకున్న షారుఖ్ ఇప్పుడు ఇక్కడ ప్రేక్షకులను అలరించేలా సినిమా ఉండాలని అంటున్నాడట. ఇక సరైన కథ వస్తే తెలుగులో సినిమా చేసేందుకు కూడా షారుఖ్ సిద్ధంగా ఉన్నాడని చెప్పొచ్చు.

Read more!

షారుఖ్ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చితంగా ఆయనకు సౌత్ సినిమాల మీద ఉన్న ప్రేమను తెలిసేలా చేస్తుంది. సౌత్ హీరోల్లానే పాన్ ఇండియా హిట్ కొట్టాలంటే కథలో ఎక్కడో ఒకచోట సౌత్ టచ్ ఉంటే బెటర్ అని భావిస్తున్నాడట. అందుకే షారుఖ్ నెక్స్ట్ సినిమా కూడా పక్కా సౌత్ ఆడియన్స్ టార్గెట్ తో వస్తుందని అంటున్నారు. ఇక ఇక్కడ స్టార్స్ తో మల్టీస్టారర్ సినిమా చేసేందుకు కూడా షారుఖ్ రెడీ అనేలా ఉన్నాడు. షారుఖ్ తో అలా మల్టీస్టారర్ చేసేందుకు ఎవరు ముందుకొస్తారన్నది చూడాలి. బాలీవుడ్ స్టార్ తో సౌత్ స్టార్స్ ఈ కాంబో కలిస్తే నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ షేక్ చేసే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News