పిఠాపురానికి చరణ్, సురేఖ.. ఎప్పుడంటే?

అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసిన రామ్ చరణ్.. తన తల్లి సురేఖతో కలిసి రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

Update: 2024-05-10 16:50 GMT

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్.. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడెప్పుడో మొదలైనా.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. స్పీడ్ గా కంప్లీట్ చేసి మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీలో రామ్ చరణ్ డ్యుయల్ రోల్ చేస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

 

రాజకీయ నాయకుడుతో పాటు ఐఏఎస్ పాత్రలో చరణ్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైజాగ్ లో షూటింగ్ జరిగినప్పుడు.. పొలిటికల్ లీడర్ గెటప్ లో ఉన్న చరణ్ లుక్స్ లీకయ్యాయి. ఇక నిన్న చరణ్.. చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆ సమయంలో క్లీన్ షేవ్ తో.. అదిరిపోయే లుక్ లో కనిపించారు. దీంతో గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో అలాగే కనిపిస్తారని అంతా మాట్లాడుకున్నారు.

Read more!

అయితే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసిన రామ్ చరణ్.. తన తల్లి సురేఖతో కలిసి రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. అక్కడి నుంచి పిఠాపురంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకోనున్నారు. మొక్కులు కూడా చెల్లించుకోనున్నారు. ఇప్పుడు సురేఖ, రామ్ చరణ్ పిఠాపురం పర్యటన గురించి అంతా మాట్లాడుకుంటున్నారు.

ఎందుకంటే.. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మెగా ఫ్యామిలీ మెంబర్ పవన్ కళ్యాణ్ పోటీ చేసున్నారు. టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి తరపున పవన్ బరిలో దిగారు. ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు గాను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంలో ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. తాను గెలిచిన తర్వాత అక్కడే ఉండి ప్రజా సమస్యలను తీర్చుతానని హామీ ఇస్తున్నారు.

ఇక పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ప్రచారం చేశారు. మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేశారు. రామ్ చరణ్ కూడా చిరు వీడియోను షేర్ చేసి మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మరికొద్ది గంటల్లో ప్రచార పర్వం ముగియనున్న వేళ.. చరణ్, సురేఖ పిఠాపురంలోని ఆలయానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఆలయ దర్శనం అయ్యాక సురేఖ, రామ్ చరణ్ ఏమైనా పవన్ కు మద్దతుగా మాట్లాడుతారేమో చూడాలి.

Tags:    

Similar News