ప్రభాస్ ఫుల్ ఇన్‌వాల్వ్.. ‘ఫౌజీ’ మూవీపై మైత్రి రవి హైప్!

ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ జోష్‌ను పెంచేసాయి.ఆ విశేషాలు చూద్దాం..

Update: 2026-08-13 07:38 GMT

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, ప్రతిభావంతుడైన దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల భీమవరంలో జరిగిన రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ప్రభాస్ డెడికేషన్ గురించి నిర్మాత రవి చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్ జోష్‌ను పెంచేసాయి.ఆ విశేషాలు చూద్దాం..

భీమవరం వేదికగా ‘ఫౌజీ’ అప్‌డేట్:

రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా ప్రచారంలో భాగంగా భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ట్రైలర్ లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు పలువురు ప్రముఖులు హాజరైన ఈ వేదికపై, నిర్మాత మైత్రి రవి ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించారు. ఇక 'ఫౌజీ' షూటింగ్ అప్‌డేట్ ఇస్తూ కాలేజీ ప్రాంగణాన్ని అభిమానుల ఈలలతో నింపేశారు.

సెట్స్‌లో ప్రభాస్ డెడికేషన్:

‘ఫౌజీ’ షూటింగ్ రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు క్రమం తప్పకుండా జరుగుతోందని రవి చెప్పారు. నిన్న తన సీన్లు లేకపోయినా కూడా ప్రభాస్ సెట్స్‌కి వచ్చి మానిటర్ దగ్గర కూర్చుని అవుట్‌పుట్ చూసుకున్నారని వెల్లడించారు. ఇక సినిమా విషయంలో ప్రభాస్ చూపుతున్న శ్రద్ధ, ఇన్‌వాల్వ్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉందని, అవుట్‌పుట్ విషయంలో ఎలాంటి తేడా రాదని భీమవరం వేదికగా హామీ ఇచ్చారు.

విద్యార్థులకు ప్రభాస్ స్వీట్ మెసేజ్ :

షూటింగ్ నుంచి భీమవరం ఈవెంట్‌కి వస్తున్నట్లు ప్రభాస్‌కు చెప్పగా, ఆయన ఎంతో ఆనందంగా నవ్వుతూ రియాక్ట్ అయ్యారట. ఎస్‌ఆర్‌కేఆర్ కాలేజీలో ఈవెంట్ అని తెలపగానే, కాలేజీ విద్యార్థులందరినీ "బాగా చదువుకోమని చెప్పండి" అంటూ ప్రభాస్ ఒక స్వీట్ మెసేజ్ ఇచ్చారని రవి పంచుకున్నారు. అలాగే రవితేజ ‘ఇరుముడి’ చిత్రబృందానికి కూడా ప్రభాస్ ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారని తెలిపారు.

డిసెంబర్ 3న విడుదల ప్లాన్:

హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాను ఈ ఏడాది డిసెంబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ చూపుతున్న డెడికేషన్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని స్పష్టమవుతోంది.

ఒకవైపు ఆగస్టు 21న రాబోతున్న రవితేజ ‘ఇరుముడి’ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూనే, మరోవైపు ప్రభాస్ ‘ఫౌజీ’పై మైత్రి రవి ఇచ్చిన ఈ పవర్ ఫుల్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇచ్చింది. ఇక ప్రభాస్ డెడికేషన్‌తో రూపుదిద్దుకుంటున్న ‘ఫౌజీ’ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.



Tags:    

Similar News