లేటైనా మంచి ఆఫర్ పట్టేసిన బుట్టబొమ్మ!
తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మగా గుర్తుండిపోయిన పూజా హెగ్డే గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.;
తెలుగు ప్రేక్షకులకు బుట్టబొమ్మగా గుర్తుండిపోయిన పూజా హెగ్డే గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అల వైకుంఠపురములో (2020) సినిమా తర్వాత ఆమెకి తెలుగులో పెద్ద హిట్ దక్కలేదు. ఆ సినిమాతో టాప్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న పూజా ఆ తర్వాత చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్, ఆచార్య చిత్రాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి.
ముఖ్యంగా ఆచార్యలో నటించినా, అది 2020లోనే సైన్ చేసిన సినిమా కావడం గమనార్హం. తర్వాత ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా గ్యాప్ తీసుకుంది. ఇందులో భాగంగా పూజా తన ఫోకస్ను తమిళం, హిందీ పరిశ్రమలపై పెట్టింది. విజయ్తో చేసిన బీస్ట్ సరిగ్గా ఆడలేకపోయినా కూలీ, జన నాయకన్, కాంచన 4, రెట్రో వంటి తమిళ సినిమాల్లో ఆఫర్స్ పట్టేసింది.
హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ తో చేసినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ఆమె గ్లామర్, కమర్షియల్ మార్కెట్లో డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ప్రాజెక్టుల చర్చల్లో ఆమె పేరు కనిపిస్తూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, పూజా హెగ్డే తెలుగులో మళ్లీ ఓ మంచి ఆఫర్ పట్టేసినట్టు టాక్. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ ప్రేమకథా చిత్రంలో నటించబోతోందట.
ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవి మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ సినిమాను దసరా, ప్యారడైస్ వంటి సినిమాల నిర్మాత సుధాకర్ చెరుకూరి తన SLV సినిమాస్ బ్యానర్పై నిర్మించబోతున్నాడు. చాలా కాలం క్రితమే స్క్రిప్ట్ రెడీ అయినా, దుల్కర్ డేట్స్ కారణంగా ఆలస్యమైంది. తాజాగా పూజాను సంప్రదించగా, ఆమె నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట.
ఈ కాంబినేషన్పై ఇప్పటికే ఇండస్ట్రీలో బజ్ మొదలైంది. పూజా కెరీర్కు ఇది మళ్లీ కొత్త జోష్ ఇచ్చే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు. సీతారామం, లక్కీ భాస్కర్ విజయాల తరువాత దుల్కర్ తెలుగు మార్కెట్లో బలమైన హవా క్రియేట్ చేశాడు. ఇప్పుడతను చేస్తున్న కాంతా, ఆకాశంలో ఒక తారా వంటి సినిమాలు మరింత హైప్ తెచ్చాయి. ఆ టైమ్లో ఈ జోడి కలిసి నటిస్తే, ప్రేక్షకుల్లో కొత్త అనుభూతి కలిగించే అవకాశముంది.