చిరు, బన్నీ మధ్య దూరం.. బేబీ నిర్మాత ఎమన్నారంటే

ఈ మూవీ ఎంత ఫేసమ్ అయ్యిందో, ఈ మూవీ నిర్మాత ఎస్ కే ఎన్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు

Update: 2023-08-11 12:14 GMT

ఈ మధ్యకాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిన్న సినిమా బేబి. ఈ మూవీ ఎంత ఫేసమ్ అయ్యిందో, ఈ మూవీ నిర్మాత ఎస్ కే ఎన్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు. అతను మెగా ఫ్యామిలీ అభిమాని అని అందరికీ తెలిసే ఉండొచ్చు. అయితే, ఎంత పెద్ద అభిమానో స్వయంగా అల్లు అర్జునే వివరించడం గమనార్హం. దీంతో, అతని క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి.

తాజాగా, ఎస్ కే ఎన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇష్టమో కూడా వివరించారు.. తాను మెగా ఫ్యామిలీలో ఉన్న దాదాపు అందరు హీరోలకు పీఆర్ గా పనిచేశానని చెప్పాడు. పవన్ జానీ సినిమా ప్లాప్ అవ్వడంతో తాను చాలా నిరాశకు గురయ్యానని, వెంటనే జేబులో రెండు వేల రూపాయలు ఉంటే కాశీ వెళ్లిపోయానని చెప్పాడు. మళ్లీ అలాంటి ప్లాప్ పవన్ కి రాకూడదని కోరుకున్నానని , అలాగే ఆయన ఎప్పుడూ బాగుండాలని కోరుకున్నట్లు చెప్పాడు.

ఇక, చాలా కాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి పడటం లేదు అనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కీ, చిరంజీవి కి మధ్య దూరం పెరిగిందా అని ఆయనను ఇంటర్వ్యూవర్ ప్రశ్నించారు. దానికి ఆయన అందులో ఎలాంటి నిజం లేదు అని చెప్పారు. అలవైకుంఠ పురం, బీబే ఈ వెంట్ లో అల్లు అర్జున్ స్వయంగా చెప్పారని, తన కట్టె కాలేవరకు తాను మెగాస్టార్ అభిమానిని అని చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఇంకా వారి మధ్య గ్యాప్ ఉందని ఎలా అనుకుంటారు అని అడిగారు.

Read more!

సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తమ ఫ్యామిలీ హీరోల సినిమాల ఈవెంట్స్ కి అందరు హీరోలు కలిసి వస్తే బాగుండదని, అందుకే వారు అలాంటి ఈవెంట్స్ లో పాల్గొనరు అని ఎస్ కే ఎన్ చెప్పారు.

అభిమానం, ప్రేమ గుండెల్లో ఉండాల్సినవని, వాటిని బయట వాళ్లకు చూపించాల్సిన అవసరం లేదని, సమయం వచ్చినప్పుడు అదే బయటపడుతుందని అన్నారు. నిజంగా ఏదైనా అవసరం వస్తే, మెగా హీరోలందరూ ఒకే తాటిపైకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News