ఐదేళ్లు వృధా.. అందుకే శివ కార్తికేయన్ ను తీసుకున్నా -డైరెక్టర్

ఇకపోతే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ప్రెస్ మీట్ లో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.;

Update: 2025-09-03 19:09 GMT

ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా.. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా రాబోతున్న చిత్రం మదరాసి. విద్యుత్ జమ్వాల్ కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కాంబోతోంది. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ ప్రెస్ మీట్ లో భాగంగా పలు ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.

రెండు రోజుల్లో విడుదల.. డైరెక్టర్ గా మీకు ఎలా అనిపిస్తోంది?

ప్రతీ సినిమాను నేను మొదటి సినిమాగానే భావిస్తాను. ‘మదరాసి’ విషయంలోనూ కూడా అలాంటి ఫీలింగ్‌‌తోనే ఉన్నాను. డిఫరెంట్ కథతో అందరి ముందుకు రాబోతోన్నాను. ఈ మూవీ తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను.

మదరాసి టైటిల్ ఎందుకు పెట్టారు? టైటిల్ ని అందరూ రిసీవ్ చేసుకుంటారా?

దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ఈ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. విలన్ ఈ మూవీలోని హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు. అందుకే టైటిల్ కూడా ‘మదరాసి’ అని పెట్టాను.మదరాసి కథ మొత్తంగా తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ అలా పెట్టాం. కథ, కథనం అన్ని ప్రాంతాల వారిని మెప్పిస్తుంది.

శివ కార్తికేయన్ నే ఎందుకు అప్రోచ్ అయ్యారు?

హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. శివ కార్తికేయన్‌కు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ పెరిగింది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది.

రుక్మిణి వసంత్ పాత్ర ఎలా ఉంటుంది?

రుక్మిణి వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అందరికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్‌ను ఆమె చేశారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ గారు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు.

హీరోగా చేస్తున్న విద్యుత్ జమ్వాల్ ను విలన్ గా ఎలా మెప్పించారు?

‘తుపాకి’ కథను విద్యుత్ జమ్వాల్‌కి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. హాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కూడా ఆయన చేస్తున్నారు. ఈ ‘మదరాసి’ కథను ఆయనకు చెప్పిన వెంటనే చాలా నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు.

ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఎలా ఉండనున్నాయి?

‘మదరాసి’లో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి. హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు ఆడియన్స్‌ను అబ్బురపరుస్తాయి.

నిర్మాత నుంచీ ఎలాంటి సపోర్ట్ లభించింది?

శ్రీ లక్ష్మీ మూవీస్, ఎన్వీ ప్రసాద్ గారితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. అనుకున్న అవుట్ పుట్ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మూవీని నిర్మించారు.

ఐదేళ్ల గ్యాప్ రావడానికి కారణం?

ఈ ఐదేళ్లలో నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ చివరకు అది మెటీరియలైజ్ అవ్వలేదు. టెక్నీషియన్‌గా నేను ఎప్పుడూ ఖాళీగా అయితే లేను. ఆ ప్రాజెక్ట్ వల్లే చాలా టైం వృథా అయింది. అందుకే ఈ గ్యాప్ వచ్చింది.

మీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

ప్రస్తుతానికి నా వద్ద చాలా ఐడియాలు, కాన్సెప్ట్‌లు ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా ఈ మూవీ అని ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతాను.

మీ ప్రొడక్షన్ కంపెనీలో నెక్స్ట్ మూవీ ఎప్పుడు కాబోతోంది?

చాలా కథలు వింటున్నాను. అందులో కొన్ని ఫైనలైజ్ చేశాం. కానీ వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. త్వరలోనే మా ప్రొడక్షన్ కంపెనీ నుంచి పట్టాలెక్కే చిత్రాల గురించి అప్డేట్ ఇస్తాను.

Tags:    

Similar News