జాన్వీ (X) రాజ్: ఒక అసంపూర్ణ పర్ఫెక్ట్ పార్టనర్‌షిప్

తాజాగా జాన్వీ క‌పూర్ షేర్ చేసిన‌ పోస్ట‌ర్ లో జాన్వీ- రాజ్ కుమార్ రావు క్రికెట్ ప్రేమికులుగా ఎంతో అద్భుతంగా క‌నిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం జాయ్ ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపించింది.

Update: 2024-05-09 02:30 GMT

జాన్వీ క‌పూర్ సౌత్ లో అడుగుపెడుతూనే వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టించేస్తోంది. ఇక్క‌డ పాన్ ఇండియా స్టార్లు ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌తో ఘ‌న‌మైన ఆరంగేట్రం చేస్తోంది. ఇది ఏ ఇత‌ర న‌టితో పోల్చినా రేర్ ఫీట్ అని చెప్పాలి. జాన్వీ నేటిత‌రం ల‌క్కీయెస్ట్ హీరోయిన్ అంటే అతిశ‌యోక్తి కాదు. ఓవైపు బాలీవుడ్ ఆఫ‌ర్ల‌ను వ‌దిలిపెట్ట‌కుండానే సౌత్ ని మ్యానేజ్ చేసేస్తోంది తెలివిగా.

 

ఇప్పుడు ప్ర‌తిభావంతుడైన‌ రాజ్‌కుమార్ రావు స‌ర‌స‌న న‌టించిన మోస్ట్ అవైటెడ్ క్రికెట్ డ్రామా 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' విడుద‌ల కోసం జాన్వీ ఆస‌క్తిగా వేచి చూస్తోంది. ఇటీవ‌లే ఈ సినిమా విడుదల తేదీని నిర్మాత క‌ర‌ణ్ ప్ర‌క‌టించారు. కార్గిల్ గ‌ర్ల్- గుంజ‌న్ స‌క్సేనా ఫేం శరణ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రం మే 31న థియేటర్లలోకి రానుంది. ధర్మ ప్రొడక్షన్స్ విడుదల తేదీని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది.

 

ఇటీవ‌ల కరణ్ జోహార్ ఈ చిత్రంతో తన వ్యక్తిగత క‌నెక్ష‌న్ ని హైలైట్ చేస్తూ.. పోస్టర్‌ను షేర్ చేసారు. అత‌డు కొత్త విడుదల తేదీని ధృవీకరించాడు. నిజానికి ఏప్రిల్ 19న విడుదల కావాల్సి ఉంది.. కానీ సినిమా విడుదల 31 మే 2024కి రీషెడ్యూల్ చేసాం.. అని తెలిపారు. తాజాగా జాన్వీ క‌పూర్ షేర్ చేసిన‌ పోస్ట‌ర్ లో జాన్వీ- రాజ్ కుమార్ రావు క్రికెట్ ప్రేమికులుగా ఎంతో అద్భుతంగా క‌నిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం జాయ్ ఎంతో బ్యూటిఫుల్ గా క‌నిపించింది.

Read more!

 

కొన్ని సినిమాలు అంతకుమించి.. కేవలం మంచి కథలు.. అవి సెల్యులాయిడ్ లవ్ కంటే చాలా ఎక్కువ ... అవి వీక్షకుడితో కలల గురించి మాట్లాడుతాయి.. మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు మన కలల మార్గంలో ఎన్నిసార్లు అయినా రావచ్చు.. MR అండ్ MRS మహి అనూహ్యంగా మన హృదయాలకు దగ్గరగా ఉంటారు'' అని మేక‌ర్స్ ఇంత‌కుముందు ఎమోష‌న‌ల్ నోట్ రాసారు. జాన్వీ- రాజ్ కుమార్ రావు జంట 2021 హార్రర్ కామెడీ 'రూహి' తర్వాత మ‌ళ్లీ రిపీట‌వుతోంది.

బాగా ప‌రిశీలిస్తే.. జాన్వీ షేర్ చేసిన‌ పోస్టర్‌లకు ఒక‌ ట్యాగ్‌లైన్ ఉంది, ''ఒక అసంపూర్ణ పర్ఫెక్ట్ పార్టనర్‌షిప్'' అనేది ట్యాగ్ లైన్. గత వారం, ముంబైలో కోల్‌కతా నైట్ రైడర్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో జాన్వీ 'మహి'ని ప్రమోట్ చేసింది. మ్యాచ్‌లో తన అనుభవాలను పంచుకుంది. మ‌హి మిస్స‌య్యాడు అంటూ క్యూరియాసిటీ పెంచేసింది జాన్వీ. ప్ర‌స్తుతం రాజ్‌కుమార్ రావు మే 10న విడుదలయ్యే తన చిత్రం శ్రీకాంత్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. దృష్టి లోపం ఉన్నప్పటికీ తన కలలను సాధించుకునేందుకు నిర్భయంగా ముందుకు సాగే పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవిత‌క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. పోస్ట‌ర్లు ట్రైల‌ర్ కు అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

Tags:    

Similar News