పిక్ టాక్ : స్విమ్మింగ్ పూల్ ముందు హంస

2016 లో ధోని : ది అన్‌టోల్డ్‌ స్టోరీ సినిమాలో నటించడం ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది

Update: 2024-05-09 07:16 GMT

టాలీవుడ్‌లో వరుణ్‌ తేజ్ కి జోడీగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్‌ సినిమా ద్వారా 2015 లో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశా పటాని. ఈ అమ్మడు టాలీవుడ్ లో మొదటి సినిమాతో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది. అయినా కూడా బాలీవుడ్ లో ఈ అమ్మడికి అదృష్టం కలిసి వచ్చింది.

2016 లో ధోని : ది అన్‌టోల్డ్‌ స్టోరీ సినిమాలో నటించడం ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఆ వెంటనే కుంగ్‌ ఫూ యోగా సినిమాలో నటించి స్టార్‌ గా నిలిచింది. ఆ తర్వాత బాఘీ, భారత్, మలాంగ్ సినిమాల్లో నటించి బాలీవుడ్‌ స్టార్స్ హీరోయిన్స్‌ జాబితాలో నిలిచింది.

2019 లో ఫోర్బ్స్‌ ఇండియా స్టార్స్ 100 జాబితాలో చోటు దక్కించుకుంది. రాజ్‌పూత్‌ హిందూ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించిన దిశా పటానీ 2013 లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇండోర్‌ 2013 లో మొదటి రన్నరప్‌ గా నిలవడం విశేషం. ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ వస్తుంది.

తాజాగా నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ పోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. టైట్ రెడ్‌ డ్రెస్ లో థైస్‌ అందాలను చూపిస్తూ స్విమ్మింగ్‌ పూల్ వద్ద అలా నిలుచుని ఉంటే హంస మాదిరిగా ఉన్నారు అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇండస్ట్రీ లో ఈ అమ్మడికి ప్రస్తుతం వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు ప్రభాస్ కి జోడీగా కల్కి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా తర్వాత తెలుగు లో ఈమె మరిన్ని సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News