స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.. అసలేమైందంటే?
తాజాగా ఒక స్టేజిపై ఆయనను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.;
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన అద్భుతమైన కామెడీతో దాదాపు 1250కు పైగా చిత్రాలలో నటించి అత్యధిక చిత్రాలలో హాస్యనటుడిగా నటించిన నటుడిగా 2010లో గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఆయన పేరు వింటేనే చాలు ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది. కొన్ని దశాబ్దాలుగా కెరియర్ సాగిస్తున్న బ్రహ్మానందం.. స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. తన ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్స్ తో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో గత మూడు దశాబ్దాలుగా కోట్లాదిమంది అభిమానులను అలరించిన ఈయన తాజాగా ఒక స్టేజిపై ఆయనను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
గత కొన్ని రోజులుగా సినిమాలే కాకుండా టీవీ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్న ఈయన తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడెల్ సీజన్ ఫోర్ కి గెస్ట్ గా విచ్చేశారు. తాజా ఎపిసోడ్లో బ్రహ్మానందం తనదైన కామెడీతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో చివర్లో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూడవచ్చు. లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి హోస్ట్ అడగగా.. ఆయనతో బ్రహ్మానందంకు ఉన్న అనుబంధం గురించి.. సాన్నిహిత్యం గురించి తెలుసుకొని ఎమోషనల్ అయిపోయారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యంతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. ఆయన కుటుంబంతో సాన్నిహిత్యం కూడా ఉంది. మంచి మనిషి బాలసుబ్రమణ్యం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరిని ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందంని ఇలా తొలిసారి కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాధ పడిపోతున్నారు.
బ్రహ్మానందం సినీ కెరియర్ విషయానికి వస్తే.. నరేష్ కథానాయకుడిగా వేజెల్ల సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రం ద్వారా కథానాయకుడు నలుగురి స్నేహితులలో ఒకరిగా నటించారు. ఈ సినిమా బ్రహ్మానందంకి తొలి సినిమానే అయినా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన 'అహ నా పెళ్ళంట' సినిమా మొదటిసారి విడుదలైంది. చిట్టెమ్మ మొగుడు, మామ కోడలు, ముగ్గురు మొనగాళ్లు, జాబిలమ్మ పెళ్లి, సాహస వీరుడు సాగర కన్య, ప్రేమ సందడి, చెప్పాలని ఉందిరా ఇలా ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
బ్రహ్మానందం తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన పాత్రల ద్వారా 2009లో భారత ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు అందుకున్న ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది అవార్డులను అందుకున్నారు. 6 సినీ మా అవార్డులు, ఒక ఫిలింఫేర్ పురస్కారం, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. అలాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేసింది.