ప్రజల కోసం టైమ్ ఇచ్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ బాబీ

ఇప్పుడు బాబీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Update: 2023-07-31 11:01 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం గా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల కలెక్షన్స్ రికార్డుని బ్రో మూవీ అందుకుంది. దీంతో హ్యాట్రిక్ హిట్స్ పవన్ కళ్యాణ్ ఖాతా లో చేరిసినట్లు అయ్యింది.

తాజాగా బ్రో సక్సెస్ మీట్ జరిగింది. ఇందులో దర్శకుడు బాబీ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూవీ గురించి మాట్లాడారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాట్స్ చెప్పారు.పవన్ కళ్యాణ్ తో కమర్షియల్ సినిమా చేసే అవకాశం ఉన్నా కూడా ఇలాంటి మంచి కంటెంట్ ని చెప్పాలని అనుకోవడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బాబీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ కి సినిమా సినిమాలు చేసుకుంటే కోట్లలో ఆదాయం వస్తుంది. ఆయనకి లాభం వచ్చే పని వదిలేసి ఈ స్వార్ధపూరిత సమాజం లో ప్రజల కోసం తన సమయం కేటాయిస్తున్నారు. మనం మన టైం గురించి మాత్రమే ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ మాత్రం తన టైం మొత్తాన్ని ప్రజాసేవకి అంకితం చేశారు. అలాంటి వ్యక్తికి కచ్చితంగా మన సపోర్ట్ ఉండాలి అని పేర్కొన్నారు.

ఇప్పుడు బాబీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాబీకి మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్టర్ ని పవన్ కళ్యాణ్ తో చేసి బాబీ తన ఖాతా లో వేసుకున్నారు.అయినా కూడా అవకాశం దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి చెప్పే ప్రయత్భం చేస్తూ ఉంటారు.

బాబీ తో పాటు గోపీచంద్ మలినేని, శ్రీవాస్ లాంటి దర్శకులు కూడా బ్రో సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరూ పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి వారి వారి మాటలలో చెప్పే ప్రయత్నం చేశారు.

Tags:    

Similar News