బెల్లంకొండ‌కు మ‌ళ్లీ ఆమెని సెట్ చేస్తున్నారా?

ప‌ద్ద‌తైన పాత్ర‌లు పోషించినంత కాలం ఆ సినిమాలు హిట్ అవ్వ‌లేదు.

Update: 2024-04-30 12:19 GMT

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. యూత్ ఐకానిక్ గాళ్ గా మారిపోయింది. ఇటీవ‌లే రిలీజ్ అయిన 'టిల్లు స్వ్కేర్' లో లిల్లీ పాత్ర‌తో మ‌రింత ఫేమ‌స్ అయింది. క్రేజీ ప్రాజెక్ట్ ల్లో అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. అనుప‌మ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి అంతా షాక్ సైతం అవుతున్నారు. అమ్మ‌డి టాలీవుడ్ జ‌ర్నీ ఇలా ట‌ర్న్ తీసుకుంటుంద‌ని తాను సైతం గెస్ చేసి ఉండ‌దు. ప‌ద్ద‌తైన పాత్ర‌లు పోషించినంత కాలం ఆ సినిమాలు హిట్ అవ్వ‌లేదు. అనుప‌మ‌కి పేరు రాలేదు. 'రౌడీబోయ్స్' తో త‌న‌లో ఛేంజోవ‌ర్ మొద‌లైంది.


ఆ సినిమా అమ్మ‌డి జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడా క్రేజ్ తోనే కొత్త అవ‌కాశాలు అందుకుంటుంది. తాజాగా అమ్మ‌డి ఖాతాలో మ‌రో సినిమా ప‌డుతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కౌశిక్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అనుప‌మ‌ని తీసుకునేలా చ‌ర్చ‌లు జ‌రుపు తున్నారు. అనుప‌మ కూడా సినిమాపై పాజిటివ్ గానే ఉంద‌ని స‌మాచారం. దాదాపు ఆమె ఎంట్రీ ఖ‌రారు అయిన‌ట్లే న‌ని చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

Read more!

అదే జ‌రిగితే సాయి శ్రీనివాస్ తో రెండ‌వ సారి జ‌త‌క‌డుతున్న‌ట్లు అవుతుంది. ఇంత‌కు ముందు ఇద్ద‌రు `రాక్ష‌సుడు` చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ థ్రిల్ల‌ర్ లో తెర‌కెక్కిన‌ మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో ఈ కాంబో మ‌రోసారి చేతులు క‌ల‌ప‌డం షురూ అయితే స‌క్స‌స్ సెంటిమెంట్ క‌లిసి రావ‌డానికి అవ‌కాశం ఉంది. స‌క్సెస్ కోసం సాయి శ్రీనివాస్ గ‌ట్టిగానే ఫైట్ చేస్తున్నాడు. 'రాక్ష‌సుడు' త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌లేదు. చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌డం లేదు.

ప్ర‌స్తుతం సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'భీమ్లా నాయ‌క్' త‌ర్వాత సాగ‌ర్ చేస్తోన్న సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇక అనుప‌మ `ప‌ర‌దా` అనే చిత్రంలో న‌టిస్తోంది. తాజా చిత్రం పాంట‌సీ హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో తెర‌కెక్క‌నుందిట‌. 'కిష్కింద‌పురి' అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నారు.

Tags:    

Similar News