'అతడు' రీ-రిలీజ్ రేటు కూడా గట్టిగానే..
ఇక రీ రిలీజ్ అనౌన్స్మెంట్తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ సినిమా రీ.రిలీజ్ టాలీవుడ్లో కొత్త రికార్డ్ సృష్టించనుందని అర్ధమవుతుంది.;
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా టాలీవుడ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్. 2005లో విడుదలైన ఈ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో బ్లాక్బస్టర్ హిట్ అయింది. మహేష్ బాబు కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిన ఈ సినిమా, యాక్షన్, ఎమోషన్స్, కామెడీతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు, ఈ సినిమా రీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. మహేష్ బాబు 50వ బర్త్డే సందర్భంగా ఆగస్ట్ 9, 2025న ‘అతడు’ 4Kలో థియేటర్లలో సందడి చేయనుంది.
అభిమానులు ఈ మాస్టర్పీస్ను మళ్లీ బిగ్ స్క్రీన్పై చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు. ‘అతడు’ సినిమాలో మహేష్ బాబు ప్రొఫెషనల్ కిల్లర్గా నటించి అదరగొట్టాడు. త్రిష హీరోయిన్గా, ప్రకాశ్ రాజ్, నాజర్, సోనూ సూద్ లాంటి నటులతో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. మణిశర్మ సంగీతం, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ సినిమాకు బలం. టెలివిజన్లో 1000 సార్లకు పైగా టెలికాస్ట్ అయిన ఈ సినిమా, ఇప్పటికీ బోర్ కొట్టని మాస్టర్పీస్.
ఇక రీ రిలీజ్ అనౌన్స్మెంట్తో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ సినిమా రీ.రిలీజ్ టాలీవుడ్లో కొత్త రికార్డ్ సృష్టించనుందని అర్ధమవుతుంది. ఈ రీ రిలీజ్కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఏంటంటే, ‘అతడు’ రీ రిలీజ్ థియేట్రికల్ రేటు రూ.3.06 కోట్లుగా నమోదైంది. ఇది టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో రికార్డు రేటుగా చెబుతున్నారు. ఈ భారీ రేటు చూస్తే, సినిమాపై అభిమానుల క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది.
ఈ సినిమా బాక్సాఫీస్లో కనీవినీ ఎరుగని రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ రూ.10 కోట్లు దాటే ఛాన్స్ ఉందని ఫ్యాన్స్ జోష్లో ఉన్నారు. గతంలో మహేష్ బాబు సినిమాలైన ‘పోకిరి’, ‘మురారి’, ‘బిజినెస్మ్యాన్’ రీ-రిలీజ్లు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ‘మురారి’ రీ-రిలీజ్ రూ.4.4 కోట్లతో టాప్ డే-1 కలెక్షన్ రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పుడు ‘అతడు’ ఈ రికార్డులను బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. మహేష్ 50వ బర్త్డే, సినిమా 20వ ఏడాది వేడుకలతో ఈ రీ-రిలీజ్ స్పెషల్గా నిలవనుంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #Athadu4KOnAug9th ట్యాగ్తో హైప్ను పెంచేస్తున్నారు. ‘అతడు’ రీ-రిలీజ్కు థియేటర్ ఓనర్లు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం 4K రిమాస్టరింగ్ జరుగుతోంది, దీంతో విజువల్స్, సౌండ్ క్వాలిటీ మరింత రిచ్గా ఉంటాయి. అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ సినిమాను 100 సార్లకు పైగా చూసినా, మళ్లీ బిగ్ స్క్రీన్పై చూడాలని ఎగ్జైట్గా ఉన్నారు. ఈ రీ-రిలీజ్ మహేష్ బాబు స్టార్డమ్ను మరోసారి హైలెట్ కానుంది.