డైరెక్టర్ చేసిన పనితో కన్నీరు పెట్టుకుందట

Update: 2019-04-22 09:24 GMT
ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ల లిస్టులో రష్మిక మందన్న పేరు టాప్ లోనే ఉంటుంది.  'ఛలో' లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విజయ్ దేవరకొండతో నటించిన 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ కావడంతో యూత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. 'దేవదాస్' నిరాశపరిచినా.. త్వరలో 'డియర్ కామ్రేడ్' తో మరిసారి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రష్మిక 'గీత గోవిందం' షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన గురించి వెల్లడించింది.  ఒకరోజు షూటింగ్ లొకేషన్ కు ఆలస్యంగా వెళ్ళిందట.  అప్పుడు యూనిట్ మెంబర్స్ లో ఎవరూ తనతో సరిగా మాట్లాడలేదట. అలా అందరూ ముభావంగా ఉండడంతో ఏం జరిగిందో అర్థం కాలేదని.. ఇబ్బందిగా అనిపించి కన్నీరు పెట్టుకున్నానని  తెలిపింది.  కాసేపటి తర్వాత దర్శకుడు పరశురామ్ తనదగ్గరకు వచ్చి చావుకబురు చల్లగా చెప్పాడట.  రష్మిక సహజంగా బాధపడుతున్నప్పుడు ఉండే హావభావాలను కెమెరాలో క్యాప్చర్ చేసేందుకు ఇలా అందరం కలిసి ఆటపట్టించామని తెలిపాడట.

దర్శకుడు పరశురామ్ పైకి కనిపించడు కానీ అల్లరి పిడుగే.. లేకపోతే సుకుమారి అయిన రష్మికను అలా నిజంగా ఏడిపించడం ఏంటో.  ఇక ఎలాగూ అది జరిగిపోయింది కాబట్టి ఆ ఏడుపు ఎక్స్ ప్రెషన్స్ 'గీత గోవిందం' లో ఏ సీన్లో వాడారో తెలిస్తే ప్రేక్షకులు ఒకసారి చూస్తారుగా? అయినా ఆ విషయం మాత్రం చెప్పలేదు రష్మిక.  


    

Tags:    

Similar News