చిరు.. బాలయ్యల్లో ముందు ఎవరితో?

Update: 2020-09-30 03:30 GMT
యాక్షన్‌ చిత్రాలకు.. ఫ్యాక్షన్‌ చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అనిపించుకున్న వివి వినాయక్‌ కొంత కాలంగా కెరీర్‌ పరంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. ఖైదీ నెం.150కి ముందు కూడా ఆయన ఫ్లాప్స్‌ చవి చూశాడు. ఖైదీ నెం.150 సినిమా సూపర్‌ హిట్‌ అయినా అది ఆయనకు మైలేజ్‌ తెచ్చి పెట్టలేదు. ఆ తర్వాత చేసిన సినిమా నిరాశ పర్చడంతో వివి వినాయక్‌ కొత్త సినిమాల విషయంలో ఆలోచనలో పడ్డాడు. ముఖ్యంగా ఆయనతో సినిమాలు చేయాలంటే స్టార్‌ హీరోలు సైతం వెనకాడుతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఈయనకు ఒకేసారి చిరంజీవి మరియు బాలకృష్ణల నుండి ఆఫర్‌ వచ్చినట్లుగా మీడియా సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

చిరంజీవి లూసీఫర్‌ రీమేక్‌ బాధ్యతలను వినాయక్‌ కు అప్పగించారట. ఇటీవల ఆయన రీమేక్‌ స్క్రిప్ట్ పై ప్రముఖ రచయిత సాయి మాధవ్‌ బుర్రాతో కలిసి వర్క్‌ చేశారట. ఇదే సమయంలో వినాయక్‌ కు బాలయ్య నుండి కూడా ఆఫర్ వచ్చిందట. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రెండేళ్ల క్రితమే బాలయ్య వినాయక్‌ ల కాంబోలో సినిమా రావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సమయంలో అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుం బోయపాటి శ్రీనుతో సినిమాను చేస్తున్న బాలయ్య తదుపరి సినిమాను వినాయక్‌ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నాడట. మరో వైపు చిరంజీవి ఆచార్య తర్వాత వేదాళం మరియు లూసీఫర్‌ రీమేక్‌ లను ఏక కాలంలో చేయాలని భావిస్తున్నారు. అందుకే బాలయ్య చిరుల్లో వినాయక్‌ ముందు ఎవరితో సినిమా చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News