రానా హీరోయిన్ చేతిలో డిగ్రీ పెట్టారు

Update: 2017-05-23 01:23 GMT
ఒకేసారి రానా దగ్గుబాటితో పాటు.. అప్పట్లో ఇద్దరు హీరోయిన్లు కూడా తెరంగేట్రం చేశారు. సెకండ్ హీరోయిన్ గా తమిళ పిల్ల ప్రియా ఆనంద్ తెరపైకి వస్తే.. ''లీడర్'' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా బెంగాళి సంతతికి చెందిన ఎన్నారై బ్యూటి రిచా గంగోపాధ్యాయ ఎంట్రీ ఇచ్చింది. షాకింగ్ విషయం ఏంటంటే.. కెరియర్లో వరుసగా చాలా ఆఫర్లు ఉండగానే అమ్మడు అన్నీ వదిలేసి అమెరికా తిరుగెళ్ళిపోయింది. 

కారణం ఏంటట? అబ్బే.. ఆమెకు చదువు కంప్లీట్ చేయాలనే కోరిక ఉందట. కేవలం సరదా కోసం పార్టు టైమ్ జాబ్ క్రింద్ హీరోయిన్ అయ్యిందట. కొన్నాళ్ళపాటు ఆ సరదా తీరగానే.. ఇక చాలు అని చెప్పి తన సొంత ఊరైన డెట్రాయిట్ వెళ్ళిపోయి.. అమ్మడు అక్కడ వాషింగ్టన్ యునివర్సిటీకి చెందిన ఒలిన్ బిజినెస్ స్కూలులో ఎం.బి.ఏ చదవడం మొదలెట్టింది. ఎంత సీరియస్ గా చదివిందంటే.. అక్కడే ఒక కాఫీ షాపులో పనిచేస్తే అమ్మడు కోర్సును పూర్తి చేసింది. ఆ డిగ్రీ చేతికి రాగానే ఇప్పుడు ఎగిరి గంతేస్తోంది. నా చేతిలో డిగ్రీ పెట్టారోచ్ అంటూ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. 

అయితే పలుమార్లు అభిమానులు ప్రశ్నించినప్పటికీ.. అబ్బే నేను సినిమాల్లోకి తిరిగి రాను.. ఐ యామ్ సారీ.. నా గోల్ అది కాదు అంటూ నిజాన్ని నిగ్గు తేల్చిన రిచా.. ఇప్పుడు ఎంబిఏ పూర్తయ్యింది కాబట్టి మళ్ళీ సినిమాలవైపు అడుగులు వేస్తుందా? చూద్దాం.
Tags:    

Similar News