సరిలేరు: తమన్నా స్పెషల్ సాంగ్ ఆజ్ మేరా ఘర్?

Update: 2019-12-20 07:44 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు జనవరి 11 న విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. కొన్ని లిరికల్ సాంగ్స్ కూడా విడుదలయ్యాయి. ఈ పాటలలో 'మైండ్ బ్లాక్' అనే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది. ఇప్పటికే ఈ పాట గురించి ఎన్నో విశేషాలు బయటకు వచ్చాయి.  భారీ ఖర్చు తో తెరకెక్కిస్తున్నారని.. మహేష్ ఈ పాటకు సూపర్ స్టెప్పులు వేస్తున్నారని అన్నారు.

ఈ పాటలో మహేష్ తో పాటుగా మిల్కీ బ్యూటీ తమన్నా స్టెప్స్ వేసిందని ఇప్పటివరకూ అందరూ అనుకున్నారు.  కానీ ఈ పాటలో తమన్నా లేదని.. తమన్నా కనిపించే పాట మరొకటని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నిజానికి రెండు ఐటెం సాంగ్స్ ఉన్నాయట.  ఒకటేమో రాయలసీమ నేపథ్యంలో వచ్చే మైండ్ బ్లాక్ సాంగ్.. మరొకటి కాశ్మీర్ నేపథ్యంలో వస్తుందట.  ఈ పాటలోనే తమన్నా మహేష్ తో కలిసి స్టెప్పులు వేస్తుందని అంటున్నారు.  

ఈ పాట సాహిత్యం "ఆజ్ మేరా ఘర్ మే పార్టీ హై తూ ఆజా మేరి రాజా" అంటూ హిందీ పదాలతో ప్రారంభం అవుతుందట.   ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారట.  ఈ పాట కూడా ప్రేక్షకులను తప్పనిసరిగా మెప్పిస్తుందని అంటున్నారు. ప్రతి సోమవారం 'సరిలేరు నీకెవ్వరు' నుంచి ఒక పాట రిలీజ్ చేస్తున్నారు కదా. దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకు ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.
Tags:    

Similar News