చడీ చప్పుడు లేకుండా తమన్నా మొదలెట్టేసింది

Update: 2018-09-19 12:55 GMT
తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన తమన్నా గత కొంత కాలంగా సినీ కెరీర్‌ పరంగా తడబడుతున్న విషయం తెల్సిందే. ఈమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి. తెలుగు మరియు తమిళంలో అడపా దడపా మాత్రమే నటిస్తూ వస్తున్న తమన్నాకు ‘అభినేత్రి’ చిత్రం సీక్వెల్‌లో ఛాన్స్‌ దక్కింది. తమిళ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ప్రభుదేవ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అభినేత్రి’ చిత్రం పెద్దగా అలరించలేక పోయింది. తమన్నా ఆ చిత్రంలో డబుల్‌ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే. తమిళం - హిందీలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఈ చిత్రం హిందీలో ప్రభుదేవా క్రేజ్‌ తో కాస్త కలెక్షన్స్‌ ను వసూళ్లు చేయగలిగింది.

ఇటీవలే ‘అభినేత్రి’ సినిమాకు కొనసాగింపు చేయబోతున్నట్లుగా ప్రభుదేవా ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రభుదేవా ప్రకటించి కొన్ని వారాలు కూడా కాలేదు - అప్పుడే షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మారిషస్‌ లో ఈ చిత్రం సైలెంట్‌ గా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. గత కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరణ జరుపుతున్నట్లుగా కోవై సరళతో ప్రభుదేవా సెల్ఫీ దిగి చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ప్రభుదేవా - తమన్నా - సోనూసూద్‌ లతో పాటు ఇంకా పలువురు నటీనటులు పాల్గొంటున్నారు.

పెద్దగా సక్సెస్‌ లు లేని ఈ సమయంలో తమన్నాకు ఇదో మంచి ఆఫర్‌ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్‌ అయితే తెలుగు - తమిళంలో పాటు హిందీలో కూడా ఈమెకు ఆఫర్స్‌ వచ్చే అవకాశం ఉంది. ‘అభినేత్రి’ చిత్రంతో పెద్దగా విజయాన్ని దక్కించుకోలేక పోయిన తమన్నా ఈ సీక్వెల్‌ తో అయినా సక్సెస్‌ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News