మేం కామెంట్ చేయం.. ఏంటంట??

Update: 2017-04-18 13:42 GMT
బాలీవుడ్లో సెలబ్రిటీలు ఎప్పుడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తారో ఎవ్వరికీ తెలియదు. అయితే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ పై వారు చేసే కామెంట్లు మాత్రం అప్పుడప్పుడూ కాంట్రోవర్శీలకు దారి తీస్తుంటాయి. అందుకే అలాంటి సెన్సిటివ్ మ్యాటర్లపై మాట్లాడటం మానేసి మానేసి.. ఇప్పుడు మాట్లాడితే తప్పులేని విషయాలపై కూడా మనోళ్ళు సైలెంట్ అయిపోతున్నారు.

పాకిస్తాన్ మిలటరీ కోర్టు భారతీయ మాజీ నేవల్ అధికారి కులభూషన్ జాదవ్ కు ఉరి శిక్ష వేసిన సంగతి తెలిసిందే. ఇతడిని రా సంస్థ గూఢచారిగా అభివర్ణిస్తూ ఉరి వేసినందుకు.. భారత ప్రభుత్వం కూడా కఠినంగానే స్పందించింది. ఈ విషయం తేలేవరకు.. ఆ ఉరి ఆగేవరకు.. అసలు పాకిస్తాన్ తో ద్వైపాక్షిక చర్చలు నుండి ఖైదీల విడుదల వరకు ఏదీ జరగదని తేల్చి చెప్పేసింది భారత్. కాని ఇవన్నీ మన హీరోలకు తెలుసా? హీరోయిన్లకు తెలుసా?

ఖచ్చితంగా తెలిసే ఛాన్సుంది కాని.. నిన్న జరిగిన ''రాబ్తా'' సినిమా ట్రైలర్ లాంచ్ లో మాత్రం.. హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఏమంటున్నాడంటే.. సెలబ్రిటీలు అంటే అన్ని విషయాలు తెలియాలని లేదు.. ఒకవేళ అది నేషనల్ ఇంట్రెస్ట్ కు సంబంధించిన విషయమే అయినప్పటికీ.. నాకు తెలిసీ తెలియకుండా కామెంట్ చేయాలని లేదు.. అంటూ సెలవిచ్చాడు. పాకిస్తాన్ చేస్తోంది తప్పు అని చెబితే రేపు పాకిస్తాన్ లో వీళ్ళ సినిమా ఆడేసి 100 కోట్లు కలక్షన్ కొల్లగొట్టదని భయపడ్డాడేమో.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News