చిక్కుల్లో స్టార్ రైటర్ .. అసలేమైందంటే?
జావేద్ అక్తర్ (76)... బాలీవుడ్ లో ఈ పేరుకో ప్రత్యేకత వుంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాప్ మోస్ట్ ఎవర్గ్రీన్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు లిరిక్ రైటర్ గా... స్క్రీన్ రైటర్ గా పని చేశారు. ఆయన కెరీర్ లో ప్రముఖ డైలాగ్ రైటర్ సమీమ్ తో కలిసి పనిచేశారు. రచయతగా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొంత కాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. యాదోంకీ బారాత్.. జంజీర్.. దీవార్.. షోలే .. త్రిశూల్.. డాన్.. కాలా పత్తర్.. మిస్టర్ ఇండియా వంటి ఎవర్గ్రీన్ చిత్రాలకు సల్మాన్ ఖాన్ ఫాదర్ సలీమ్ ఖాన్ తో కలిసి అద్భుతమైన కథలు అందించిన జావేద్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు.
తన వివాదాస్పద వ్యాఖ్యలతో జావేద్ కోర్టు నోటీసులు అందాయి. దాంతో పాటు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆరెస్సెస్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఆరెస్సెస్ ని తాలిబన్ లతో పోలుస్తూ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆరెస్సెస్ కు చెందిన కార్యకర్త వివేక్ చంపానీర్కర్ ... జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సివిల్ కోర్టు న్యాయమూర్తి జావెద్ కు 1 రూపాయి నామినల్ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జావేద్ అక్తర్ ఆరెస్సెస్ ని ఎక్కడా ప్రస్థావించక పోయినా ఆయన మాటల భావాన్ని బట్టి ఆయనపై ఆరెస్సెస్ కార్యకర్త వివేక్ చంపానీర్కర్ కోర్టుని ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాలీబన్లు ప్రత్యేక ముస్లీమ్ దేశాన్ని కోరుకుంటున్నారని వారి తరహాలోనే ఇక్కడి వారు హిందూ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నారని` ట్వీట్ చేశారు జావేద్.. అయితే ఆరెస్సెస్ పేరుని నేరుగా వాడకపోయినా ఆ అర్థం వచ్చేలా ట్వీట్ చేయడంతో మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. నవంబర్ 12న తాజా నోటీసులకు సంజాయిషీ ఇవ్వాలని జావేద్ని కోర్టు ఆదేశించింది.
కంగనతో ఫికర్ ఏమైనట్టు..?
గీత రచయిత జావేద్ అక్తర్ వర్సెస్ కంగన వివాదం గురించి తెలిసిందే. ఇటీవల జావేద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కంగనా రనౌత్ కోర్టుకు హాజరు కావడానికి అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చివరి అవకాశం కల్పించింది. తదుపరి విచారణకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కంగనా తరఫున హాజరైన న్యాయవాది కంగనా స్వదేశంలో లేరని అందువల్ల మంగళవారం (జూలై 27) విచారణ సందర్భంగా ఆమె హాజరుకాదని కోర్టుకు తెలిపారు. ఆమెకు తన వ్యక్తిగత ప్రదర్శన నుండి మినహాయింపు ను లాయర్ కోరారు. జావేద్ అక్తర్ తరపున హాజరైన న్యాయవాది జే భరద్వాజ్ ఈ మినహాయింపును వ్యతిరేకించారు. కంగనా ఇంతకుముందు కోర్టు హాజరును డుమ్మా కొట్టినందున.. ఇంతవరకూ ఏ తేదీనా హాజరుకానందున బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు.
రెండు వైపులా వాదనలు విన్న తరువాత మహమ్మారి సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) కారణంగా,... అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్.ఆర్. ఖాన్ ఆమెకు ఈ రోజు మినహాయింపునిచ్చారు. అయితే కంగనా మరుసటి తేదీన హాజరుకాకపోతే ఆమెపై బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతిలోని 499 ... 500 సెక్షన్ల కింద నేరపూరితంగా పరువు నష్టం దావా వేసారంటూ కంగనకు వ్యతిరేకంగా జావేద్ అక్తర్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కంగనా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ ``బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్`` లో భాగమని.. ``ఆయన దాని నుండి బయటపడగలడు`` అని వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును 2020 లో సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో కంగన ఈ వ్యాఖ్యానం చేశారు.
కంగనా వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేసింది. అయితే దిండోషి సెషన్స్ కోర్టు ఈ సవాలును తిరస్కరించింది. కంగనా ఇప్పుడు బాంబే హైకోర్టులో విచారణను సవాలు చేసారు. ప్రస్తుతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
చాలా కాలంగా కేసు విచారణ..
భారతీయ శిక్షాస్మృతిలోని 499 మరియు 500 సెక్షన్ల క్రింద జావేద్ సమర్పించిన ఫిర్యాదుకు పూర్తి కౌంటర్ పిటిషన్ లో ఏం ఉంది? అంటే..``న్యాయపరమైన పరిశోధన లేకుండా ప్రమాణంపై ఫిర్యాదులో పేర్కొన్న సాక్షులను విచారించడంలో విఫలమైనందున సెక్షన్ 200 ప్రకారం,.. సిఆర్పిసి సెక్షన్ 202 (2) ప్రకారం.. సిఆర్పిసి సెక్షన్ 162 లోని నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు సేకరించిన అదే సాక్షి-స్టేట్మెంట్లపై మరోసారి ఆధారపడటానికి ప్రయత్నించారు. వారి సంతకాలనే సేకరించారు`` అని కంగన తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు.
ఇంతకుముందు జావేద్ అక్తర్ .. కంగన పాస్ పోర్ట్ ఎపిసోడ్ పై బొంబాయి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తప్పుడు కథలు వినిపిస్తోందని కంగనపై బాలీవుడ్ గేయ రచయిత ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చిలో కంగనా రనౌత్ ను పిలిచినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఎత్తిచూపారు. తరువాత దిందోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో కంగనా అభ్యర్ధనను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ కారణంగానే కంగనా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది.
పోలీసుల చర్యలతో సాక్షులను సులభంగా ప్రభావితం చేయవచ్చని ఈ కారణంగా కోర్టులో ప్రమాణ స్వీకారం కింద భౌతిక సాక్షుల సాక్ష్యాలను రికార్డ్ చేయడం.. ఫిర్యాదుదారుడు జావేద్ అక్తర్ చేత ప్రత్యక్షంగా లేదా వాస్తవంగా ఏదైనా కేసు నమోదు చేయబడిందా? అనేది నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది. అటువంటిది అనుమతిస్తే ఇతర న్యాయాధికారులకు తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని కంగనా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇది చాలా కేసులలో నిందితుల హక్కులు స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. కంగనా రనౌత్ పై ఒక వార్తా ఛానెల్ లో ఆమె ఇంటర్వ్యూ విన్న తర్వాత జావేద్ అక్తర్ తనపై ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 2021 లో మేజిస్ట్రేట్ రనౌత్ కు నోటీసు ఇచ్చారు. అయితే రనౌత్ కోర్టుకు హాజరుకాలేదు. మార్చిలో బెయిల్ వారెంట్ జారీ చేయబడింది. వారెంట్ రద్దు చేయటానికి రనౌత్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ధాకడ్ చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా కంగనకు పాస్ పోర్ట్ రెన్యువల్ పరంగా చిక్కులు ఏర్పడగా తాను కోర్టును ఆశ్రయించి పోరాడిన సంగతి విధితమే.
తన వివాదాస్పద వ్యాఖ్యలతో జావేద్ కోర్టు నోటీసులు అందాయి. దాంతో పాటు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆరెస్సెస్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఆరెస్సెస్ ని తాలిబన్ లతో పోలుస్తూ జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఆరెస్సెస్ కు చెందిన కార్యకర్త వివేక్ చంపానీర్కర్ ... జావెద్ అక్తర్ వ్యాఖ్యలపై కోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సివిల్ కోర్టు న్యాయమూర్తి జావెద్ కు 1 రూపాయి నామినల్ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జావేద్ అక్తర్ ఆరెస్సెస్ ని ఎక్కడా ప్రస్థావించక పోయినా ఆయన మాటల భావాన్ని బట్టి ఆయనపై ఆరెస్సెస్ కార్యకర్త వివేక్ చంపానీర్కర్ కోర్టుని ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాలీబన్లు ప్రత్యేక ముస్లీమ్ దేశాన్ని కోరుకుంటున్నారని వారి తరహాలోనే ఇక్కడి వారు హిందూ రాష్ట్రంగా మార్చాలని భావిస్తున్నారని` ట్వీట్ చేశారు జావేద్.. అయితే ఆరెస్సెస్ పేరుని నేరుగా వాడకపోయినా ఆ అర్థం వచ్చేలా ట్వీట్ చేయడంతో మరోసారి ఆయన వివాదంలో చిక్కుకున్నారు. నవంబర్ 12న తాజా నోటీసులకు సంజాయిషీ ఇవ్వాలని జావేద్ని కోర్టు ఆదేశించింది.
కంగనతో ఫికర్ ఏమైనట్టు..?
గీత రచయిత జావేద్ అక్తర్ వర్సెస్ కంగన వివాదం గురించి తెలిసిందే. ఇటీవల జావేద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కంగనా రనౌత్ కోర్టుకు హాజరు కావడానికి అంధేరిలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చివరి అవకాశం కల్పించింది. తదుపరి విచారణకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కంగనా తరఫున హాజరైన న్యాయవాది కంగనా స్వదేశంలో లేరని అందువల్ల మంగళవారం (జూలై 27) విచారణ సందర్భంగా ఆమె హాజరుకాదని కోర్టుకు తెలిపారు. ఆమెకు తన వ్యక్తిగత ప్రదర్శన నుండి మినహాయింపు ను లాయర్ కోరారు. జావేద్ అక్తర్ తరపున హాజరైన న్యాయవాది జే భరద్వాజ్ ఈ మినహాయింపును వ్యతిరేకించారు. కంగనా ఇంతకుముందు కోర్టు హాజరును డుమ్మా కొట్టినందున.. ఇంతవరకూ ఏ తేదీనా హాజరుకానందున బెయిల్ వారెంట్ జారీ చేయాలని కోరారు.
రెండు వైపులా వాదనలు విన్న తరువాత మహమ్మారి సమయంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) కారణంగా,... అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్.ఆర్. ఖాన్ ఆమెకు ఈ రోజు మినహాయింపునిచ్చారు. అయితే కంగనా మరుసటి తేదీన హాజరుకాకపోతే ఆమెపై బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతిలోని 499 ... 500 సెక్షన్ల కింద నేరపూరితంగా పరువు నష్టం దావా వేసారంటూ కంగనకు వ్యతిరేకంగా జావేద్ అక్తర్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కంగనా ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జావేద్ అక్తర్ ``బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్`` లో భాగమని.. ``ఆయన దాని నుండి బయటపడగలడు`` అని వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును 2020 లో సిబిఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో కంగన ఈ వ్యాఖ్యానం చేశారు.
కంగనా వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేసింది. అయితే దిండోషి సెషన్స్ కోర్టు ఈ సవాలును తిరస్కరించింది. కంగనా ఇప్పుడు బాంబే హైకోర్టులో విచారణను సవాలు చేసారు. ప్రస్తుతం విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
చాలా కాలంగా కేసు విచారణ..
భారతీయ శిక్షాస్మృతిలోని 499 మరియు 500 సెక్షన్ల క్రింద జావేద్ సమర్పించిన ఫిర్యాదుకు పూర్తి కౌంటర్ పిటిషన్ లో ఏం ఉంది? అంటే..``న్యాయపరమైన పరిశోధన లేకుండా ప్రమాణంపై ఫిర్యాదులో పేర్కొన్న సాక్షులను విచారించడంలో విఫలమైనందున సెక్షన్ 200 ప్రకారం,.. సిఆర్పిసి సెక్షన్ 202 (2) ప్రకారం.. సిఆర్పిసి సెక్షన్ 162 లోని నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు సేకరించిన అదే సాక్షి-స్టేట్మెంట్లపై మరోసారి ఆధారపడటానికి ప్రయత్నించారు. వారి సంతకాలనే సేకరించారు`` అని కంగన తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు.
ఇంతకుముందు జావేద్ అక్తర్ .. కంగన పాస్ పోర్ట్ ఎపిసోడ్ పై బొంబాయి హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తప్పుడు కథలు వినిపిస్తోందని కంగనపై బాలీవుడ్ గేయ రచయిత ఫిర్యాదులో పేర్కొన్నారు. మార్చిలో కంగనా రనౌత్ ను పిలిచినప్పటికీ కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్దిఖీ ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ కోర్టు ముందు ఎత్తిచూపారు. తరువాత దిందోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో కంగనా అభ్యర్ధనను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ కారణంగానే కంగనా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది.
పోలీసుల చర్యలతో సాక్షులను సులభంగా ప్రభావితం చేయవచ్చని ఈ కారణంగా కోర్టులో ప్రమాణ స్వీకారం కింద భౌతిక సాక్షుల సాక్ష్యాలను రికార్డ్ చేయడం.. ఫిర్యాదుదారుడు జావేద్ అక్తర్ చేత ప్రత్యక్షంగా లేదా వాస్తవంగా ఏదైనా కేసు నమోదు చేయబడిందా? అనేది నిర్ధారించడానికి చాలా ముఖ్యమైనది. అటువంటిది అనుమతిస్తే ఇతర న్యాయాధికారులకు తప్పుడు ఉదాహరణగా నిలుస్తుందని కంగనా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎందుకంటే ఇది చాలా కేసులలో నిందితుల హక్కులు స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. కంగనా రనౌత్ పై ఒక వార్తా ఛానెల్ లో ఆమె ఇంటర్వ్యూ విన్న తర్వాత జావేద్ అక్తర్ తనపై ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి 2021 లో మేజిస్ట్రేట్ రనౌత్ కు నోటీసు ఇచ్చారు. అయితే రనౌత్ కోర్టుకు హాజరుకాలేదు. మార్చిలో బెయిల్ వారెంట్ జారీ చేయబడింది. వారెంట్ రద్దు చేయటానికి రనౌత్ మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. ధాకడ్ చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండగా కంగనకు పాస్ పోర్ట్ రెన్యువల్ పరంగా చిక్కులు ఏర్పడగా తాను కోర్టును ఆశ్రయించి పోరాడిన సంగతి విధితమే.