అత్తాకోడళ్లు.. శాతకర్ణిలో అడుగు పెట్టారు

Update: 2016-08-30 04:13 GMT
నందమూరి నటసింహం బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. వరుసగా కొన్ని నెలల పాటు బ్రేక్ లేకుండా షూటింగ్ చేసిన దర్శకుడు క్రిష్.. ఈ నెల ప్రారంభంలో తన పెళ్లి సందర్భంగా బ్రేక్ తీసుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ చేసిన శాతకర్ణి చిత్ర షూటింగ్ ను.. తిరిగి ప్రారంభించేశాడు క్రిష్.

లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ కి సంబంధించి.. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. గౌతమిపుత్ర శాతకర్ణి యూనిట్ తో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని  జాయిన్ అయింది. హీరో తల్లిగా గౌతమి పాత్రలో ఈ సినిమాలో కనిపించనుంది హేమమాలిని. శాతవాహన వీరుడికి తల్లిగా నటిస్తుండడం చాలా సంతోషాన్ని ఇస్తోందని ఇప్పటికే హేమమాలిని చెప్పగా.. ఇదే షెడ్యూల్ లో హీరోయిన్ శ్రియకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కూడా జరగనుంది. ఇప్పటివరకూ యుద్ధ సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించగా.. ఇవన్నీ బాలకృష్ణపై నడిచే సీన్స్ మాత్రమే.

ఇప్పుడు రాజకోటకు సంబంధించిన సీన్స్ ను హేమమాలిని.. శ్రియలపై తీయనున్నాడు క్రిష్. శాతకర్ణిలో వీరిద్దరూ అత్తాకోడళ్లుగా నటించనున్నారు. 18 రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుండగా.. దీని తర్వాత మరో షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని తెలుస్తోంది. గ్రాఫిక్ వర్క్ కూడా పూర్తి చేసేసి 2017 సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ గౌతమిపుత్ర శాతకర్ణిని రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు దర్శకుడు క్రిష్.
Tags:    

Similar News