కబీర్ సింగ్ క్రేజ్ పీక్స్ లో ఉందిగా

Update: 2019-06-20 11:37 GMT
తెలుగులో కల్ట్ ఫిలిం స్టేటస్ సంపాదించిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ రీమేక్ లో షాహిద్ కపూర్ - కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.  రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  రీమేక్ అయినప్పటికీ ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతుండడం గొప్ప విషయమే.

ఒరిజినల్ ఫీల్ ను క్యారీ చేస్తూ ప్రోమోస్ ను కట్ చేయడం.. పాటలు వెంటనే ఆకట్టుకునేలా ఉండడంతో సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. విజయ్ దేవరకొండ పాత్రను షాహిద్ చేయగలడా అని మొదట్లో కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు కానీ ప్రోమోస్ రిలీజ్ అయిన తర్వాత వారి అనుమానాలు దూరమయ్యాయి.  విజయ్ దేవరకొండను మ్యాచ్ చేసినా.. చెయ్యకపోయినా సినిమాకు ఒక నటుడిగా మాత్రం షాహిద్ న్యాయం చేస్తాడని అనిపించింది.  అందుకే ఈ సినిమాకు నార్త్.. సౌత్ తేడా లేకుండా అడ్వాన్సు బుకింగ్ జోరుగా సాగుతోందట.  నార్త్ లో క్రేజ్ అంటే సరే అనుకోవచ్చు.. చెన్నైలో కూడా 'కబీర్ సింగ్' టికెట్లు జోరుగా అమ్ముడవుతున్నాయట.  టికెట్లు హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతుండడంతో షోస్ పెంచుతున్నారట.

ఈ సినిమాకు నార్త్ బెల్ట్ లో ముఖ్యంగా ఢిల్లీలో రెస్పాన్స్ ఎక్కువగా ఉందట.  కానీ ముంబై.. పూణే లో మాత్రం రెస్పాన్స్ తక్కువ ఉందని సమాచారం. సౌత్ లోహైదరాబాద్.. బెంగుళూరు లాంటి నగరాల్లో కూడా 'కబీర్ సింగ్' టికెట్లు అమ్మకం జోరుగా సాగుతోందట. ఈ సినిమా షాహిద్ కపూర్ కెరీర్ లో బిగ్గెస్ట్ సోలో హిట్ గా నిలవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకముందే ఇలాంటి రెస్పాన్స్ ఉంటే.. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీసుకు పండగే.  

    

Tags:    

Similar News