రెండేళ్ల తర్వాత శివాజీ రీఎంట్రీ

Update: 2017-04-27 06:08 GMT
తెలుగు నటుడు శివాజీ గత రెండేళ్లుగా సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ గా హీరోగా మంచి గుర్తింపు ఉన్న శివాజీ.. కొంత కాలంగా రాజకీయాలపై దృష్టి పెట్టాడు. రాజకీయాలు అనేకంటే సామాజిక సమస్యలపై మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదాపై తనవంతుగా పోరాడాడు శివాజీ.

'గత రెండేళ్లుగా రాజకీయ అంశాలతో బిజీగా ఉన్నాను. అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకున్నాను. నిజాయితీ లేని వాగ్దానాలతో జనాలను మోసం చేయకూడదు. బహుశా ఇందుకు కొంత కాలం పట్టచ్చు. కానీ కొన్నాళ్లలో ఇది తప్పకుండా సాకారం అవుతుంది. నేను ఇది ప్రజల కోసమే చేస్తున్నాను. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా పోరాడతాను. ఎవరైనా పోరాడితే మద్దతు ఇస్తాను' అని చెప్పిన శివాజీ.. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీకి రెడీ అయినట్లు చెప్పాడు.

'కొన్ని రోజుల పాటు నేను అమెరికా వెళుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత కొత్త సినిమాను ప్రారంభించబోతున్నా. యూఎస్ లోని ఓ  ప్రొడక్షన్ హౌస్ కి కంటెంట్ ఇచ్చేందుకు అంగీకరించాను. ఒక నెలపాటు అక్కడ ఉండాల్సి ఉంటుంది. తిరిగి రాగానే నా సినిమాపై దృష్టి పెడతాను' అని చెప్పాడు శివాజీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News