పేలుడులో శివాజీరాజా ఫ్రెండ్ మృతి

Update: 2019-04-23 08:59 GMT
శ్రీలంక పేలుళ్లలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ పేలుళ్లలో హైదరాబాద్ వాసి కూడా చనిపోయారు. హైదరాబాద్ లోని మణికొండకు చెందిన తులసీరామ్ కొలంబో బాంబు పేలుళ్లలో చనిపోయారు.  ఆయన బంధువు మాచినేని శ్రీనివాస బాబుకు తీవ్రగాయాలయ్యాయి. మరో ఫ్రెండ్ తులసీరామ్ మాత్రం చనిపోయాడు. నటుడు శివాజీ రాజాకు శ్రీనివాసబాబు ఆప్త మిత్రుడు. చివరి నిమిషంలో శివాజీరాజా కొలంబో పర్యటనను రద్దు చేసుకోవడంతో బతికి బట్టకట్టారు.

ఈ పేలుళ్లలో శ్రీనివాసబాబుకు తీవ్రగాయాలు కావడంతో శివాజీరాజా షాక్ కు గురయ్యారు. ఇంట్లో శుభకార్యం ఉండడంతో తన శ్రీలంక పర్యటన రద్దు అయ్యిందని శివాజీరాజా తెలిపారు. అయిదుగురు ఫ్రెండ్స్ తో కలిసి శ్రీలంక టూర్ ప్లాన్ చేసుకున్నామని..కానీ ఇంట్లో ఫంక్షన్ కారణంగా తన టూర్ రద్దు చేసుకున్నానని శివాజీరాజా తెలిపారు.

గడిచిన రెండు రోజులుగా తనకు పెద్దఎత్తున ఫోన్లు వస్తున్నాయని.. తాను కూడా శ్రీలంక వెళ్లి గాయపడ్డానని అంటున్నారని.. అది నిజం కాదని శివాజీరాజా తెలిపారు. శ్రీనివాసబాబు తనకు క్లోజ్ ఫ్రెండ్ అని అతడికి గాయాలయ్యాయని తెలిపారు. మొత్తం ఐదుగురం ఫ్రెండ్ ప్లాన్ చేసుకున్నామని శ్రీనివాసబాబు   కజిన్ పేలుళ్లలో చనిపోయాడని తెలిపారు. శ్రీనివాసబాబుకు చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని దేవుడి దయవల్ల బతికిపోయాడని వివరించారు. తన ఇంట్లో ఫంక్షన్ కారణంగా తాను వెల్లలేదని వివరణ ఇచ్చారు.
Tags:    

Similar News