కరోనా టైం: కొడుకుతో స్టార్ హీరోయిన్ మసాజ్..

Update: 2020-04-05 10:25 GMT
ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే తారలకు కరోనా దయ వల్ల ఇప్పుడు పూర్తి విశ్రాంతి దొరికింది. ఇంట్లో ఖాళీగా ఉంటున్న వారంతా కుటుంబ సభ్యులతో గడుపుతూ తమ విలువైన సమయాన్ని సంతోషంగా గడుపుతున్నారు.

అయితే ఖాళీగా ఉంటున్న తారలు.. తమ రోజు వారీ కార్యక్రమాలను వీడియోలు, ఫొటోలు తీస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. తమలోని అంతమైపోయిన కళలను నిద్రలేపి మరీ టైం పాస్ చేస్తున్నారు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న శిల్పా తన కొడుకుతో మసాజ్ చేయించుకుంది. ఇందుకు డబ్బులు ఇవ్వనని.. లాక్ డౌన్ వేళ అంతా వస్తుమార్పిడినేని చెప్పింది. బదులుగా తాను నీకు మసాజ్ చేస్తానంటూ కొడుకుతో అన్నది.అయితే వీరికి తెలియకుండా ఈ వీడియో శిల్పా తల్లి తీసింది.

కొడుకుతో సరదాగా గడిపిన ఈ వీడియోను షర్ చేసిన శిల్పా ‘ఈ వీడియో ఎంత అమూల్యమైనదో తనకు ఇప్పుడు అర్థమైందంటూ’ ఉద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో కరోనా పరిస్థితికి అద్దం పడుతూ వైరల్ అయ్యింది.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News