సమంతకు వెళ్ళిపోయే టైమొచ్చింది

Update: 2015-07-28 18:05 GMT
సౌత్‌ నుంచి నార్త్‌ కి వెళ్లి అక్కడ జైత్ర యాత్ర సాగించడం అనేది ఆషామాషీ కాదు. ఇప్పటికే టాలీవుడ్‌, కోలీవుడ్‌ నుంచి స్టార్‌ హీరోయిన్లు ఎందరో ఉత్తరాదిపై దండయాత్ర చేసి చతికిలబడిన సంగతి తెలిసిందే. ఒక్క అసిన్‌ తప్ప దశాబ్ధ కాలం పోరాటం చేసిన నవతరం నాయిక ఎవరూ లేనేలేరు.

త్రిష, తమన్నా లాంటి నాయికలు అక్కడ అట్టర్‌ ఫ్లాప్‌ అయిపోయారు. అందుకేనేమో సౌత్‌ లో ఓ ఎగ్జిస్టెన్సీ వచ్చేశాక బాలీవుడ్‌ వెళ్లాలంటే తటపటాయిస్తుంటారు భామలంతా. కానీ గోల్డెన్‌ లెగ్‌ సమంతకి ఇప్పుడు ఆ వంతు వచ్చింది. తన ప్రమేయం లేకుండానే ఈ అమ్మడు బాలీవుడ్‌ లో అడుగుపెడుతోంది. అది కూడా ధనుష్‌ తో సినిమా వల్లే ఈ ఎంట్రీ సాధ్యమవుతోంది. సమంత ప్రస్తుతం ధనుష్‌ సరసన విఐపీ 2లో నటిస్తోంది. ధనుష్‌ కి బాలీవుడ్‌ లోనూ క్రేజు ఉంది కాబట్టి ఈ చిత్రాన్ని అనువదించి సైమల్టేనియస్‌ గా బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. ఆ లెక్కన సమంత తన ప్రమేయం లేకుండానే ఉత్తరాదికి పరిచయమైపోతున్నట్టే.

విఐపి 2 చిత్రంలో ధనుష్‌ తో పాటు ప్రభుదేవా, సిమ్రన్‌ వంటి వాళ్లు నటించారు.  బాక్సాఫీస్‌ వద్ద భారీ అంచనాలున్నాయి. ఈ ఊపులోనే సమంత బాలీవుడ్‌ వెళ్లడం కరెక్టేనని అంటున్నారంతా.
Tags:    

Similar News