జీస్టూడియోతో రూ.230 కోట్ల భారీ డీల్ కుదుర్చుకున్న `రాధే`
కోవిడ్ కల్లోలం నడుమ అసలు సినిమా రిలీజవుతుందా లేదా? అన్న సందిగ్ధత నెలకొంటే .. మరోవైపు దాంతో సంబంధమే లేకుండా సల్మాన్ భాయ్ నటించిన రాధే అసాధారణ డీల్ సంచలనంగా మారింది.
సల్మాన్ కథానాయకుడిగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న `రాధే`ను జీ స్టూడియోకు రూ. 230 కోట్లకు విక్రయించారని తెలిసింది. శాటిలైట్.. థియేట్రికల్ (ఇండియా + ఓవర్సీస్).. రైట్స్ సహా డిజిటల్ హక్కులు మ్యూజిక్ హక్కులను ఓవరాల్ గా ఇంత పెద్ద మొత్తానికి అమ్మారని తెలుస్తోంది.
ఇది కోవిడ్ కాలంలో అతిపెద్ద ఒప్పందం. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తో సల్మాన్ కి టేబుల్ ప్రాఫిట్ లభించింది. ఇది సహేతుకమైన ఒప్పందం. అయితే జీకి కూడా పెద్దగా రిస్క్ లేదు. ఎందుకంటే సల్మాన్ సినిమాలు వివిధ ప్లాట్ ఫామ్ లలో పెద్ద విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా శాటిలైట్ వీక్షణ పరంగా గొప్ప రాబడి దక్కుతుందన్న అంచనా ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వైఆర్ఎఫ్ కమీషన్ ప్రాతిపదికన థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అది జీ స్టూడియోస్ వశమవుతుంది. వీరికి బాధ్యత అప్పగించారన్నమాట. పల్కాజ్ త్రిపాఠి నటించిన సల్మాన్ ప్రొడక్షన్ `కాగజ్` కూడా జీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ చూస్తోంది. అతను జీ నెట్ వర్క్ తో మల్టీ మూవీ శాటిలైట్ ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. అతని చివరి 3 విడుదలలు - రేస్ 3- భారత్ - దబాంగ్ 3 జీ సినిమాలోనే ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ను ఆడియెన్ వీక్షించారు. ” అని వాణిజ్య వర్గాలు తెలిపాయి.
`రాధే`లో దిషా పటాని కథానాయికగా నటించగా.. రణదీప్ హుడా.. జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కొరియన్ ఫిల్మ్ కి రీమేక్. థియేటర్లలో ఈద్ 2021 విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఇటీవల తన 55 వ పుట్టినరోజును జరుపుకుని.. ప్రస్తుతం తన పన్వెల్ ఫామ్ లో క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్నాడు. జనవరి మొదటి వారంలో అతను ఆయుష్ శర్మతో కలిసి `యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్` చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తాడు. మార్చి 2021 నుండి `టైగర్ 3` సెట్స్ లోకి వెళ్తాడు.
సల్మాన్ కథానాయకుడిగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న `రాధే`ను జీ స్టూడియోకు రూ. 230 కోట్లకు విక్రయించారని తెలిసింది. శాటిలైట్.. థియేట్రికల్ (ఇండియా + ఓవర్సీస్).. రైట్స్ సహా డిజిటల్ హక్కులు మ్యూజిక్ హక్కులను ఓవరాల్ గా ఇంత పెద్ద మొత్తానికి అమ్మారని తెలుస్తోంది.
ఇది కోవిడ్ కాలంలో అతిపెద్ద ఒప్పందం. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తో సల్మాన్ కి టేబుల్ ప్రాఫిట్ లభించింది. ఇది సహేతుకమైన ఒప్పందం. అయితే జీకి కూడా పెద్దగా రిస్క్ లేదు. ఎందుకంటే సల్మాన్ సినిమాలు వివిధ ప్లాట్ ఫామ్ లలో పెద్ద విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా శాటిలైట్ వీక్షణ పరంగా గొప్ప రాబడి దక్కుతుందన్న అంచనా ఉంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వైఆర్ఎఫ్ కమీషన్ ప్రాతిపదికన థియేటర్లలో విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అది జీ స్టూడియోస్ వశమవుతుంది. వీరికి బాధ్యత అప్పగించారన్నమాట. పల్కాజ్ త్రిపాఠి నటించిన సల్మాన్ ప్రొడక్షన్ `కాగజ్` కూడా జీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ప్రీమియర్ చూస్తోంది. అతను జీ నెట్ వర్క్ తో మల్టీ మూవీ శాటిలైట్ ఒప్పందాన్ని కలిగి ఉన్నాడు. అతని చివరి 3 విడుదలలు - రేస్ 3- భారత్ - దబాంగ్ 3 జీ సినిమాలోనే ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ను ఆడియెన్ వీక్షించారు. ” అని వాణిజ్య వర్గాలు తెలిపాయి.
`రాధే`లో దిషా పటాని కథానాయికగా నటించగా.. రణదీప్ హుడా.. జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం కొరియన్ ఫిల్మ్ కి రీమేక్. థియేటర్లలో ఈద్ 2021 విడుదలకు సిద్ధమవుతోంది. సల్మాన్ ఇటీవల తన 55 వ పుట్టినరోజును జరుపుకుని.. ప్రస్తుతం తన పన్వెల్ ఫామ్ లో క్రిస్మస్ సెలవులను ఆస్వాదిస్తున్నాడు. జనవరి మొదటి వారంలో అతను ఆయుష్ శర్మతో కలిసి `యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్` చిత్రీకరణను తిరిగి ప్రారంభిస్తాడు. మార్చి 2021 నుండి `టైగర్ 3` సెట్స్ లోకి వెళ్తాడు.