ఆ హీరోయిన్ ని ఎవరూ ఇబ్బంది పెట్టలేదట

Update: 2016-10-30 13:30 GMT
మలయాళ ప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవి టాలీవుడ్ అరంగేట్రం చేసేస్తోంది. ఫిదా అంటూ వరుణ్ తేజ్ తో కలిసి టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేసేందుకు దూసుకొస్తోంది. ఫుల్లు మేకప్ తోనే ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కష్టం అయిన రోజుల్లో.. అసలు మేకప్ లేకుండా.. మొహంపై కనిపించే పింపుల్స్ తో సహా ఒరిజినల్ లుక్ తో మలయాళ ప్రేమమ్ లో ఈమె కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే.. ఈభామకు ఆ తర్వాత బోలెడన్ని ఆఫర్స్.. ముఖ్యంగా కోలీవుడ్ నుంచి అనేక అవకాశాలు వచ్చినా.. ఈ భామ డబుల్ మీనింగ్ డైలాగులకు.. రివీలింగ్ డ్రెస్సులకు నో చెప్పడంతో అందరూ గుర్రుగా ఉన్నారనే టాక్ వచ్చింది.

వీటిపై ఇప్పుడు సాయి పల్లవి క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేసింది. 'నేను తమిళ ఇండస్ట్రీలో కనీసం వర్క్ చేయడం కూడా స్టార్ట్ చేయలేదు. అలాంటప్పుడు నా పై కంప్లెయింట్ చేసే ఛాన్స్ ఉండదు. ఇలాంటి ఫన్నీ రూమర్స్ ఎలా వస్తాయో కదా.. అయినా ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. అసలు విషయం ఏంటంటే.. ఇప్పటివరకూ ఇలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పమని నన్ను ఎవరూ అడగలేదు. పైగా వేసుకునేందుకు నేను ఇబ్బందిపడే డ్రస్సులపై ఒత్తిడి కూడా చేయలేదు' అంటూ తేల్చేసింది సాయి పల్లవి.

ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకూ అన్ని పరిస్థితులు తనకు బాగానే ఉన్నాయని.. ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏవీ లేవని ఈ ఫిదా బ్యూటీ చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News