పిక్‌ టాక్‌ : మెగా వారసుల అరుదైన కలయిక

Update: 2020-05-25 13:30 GMT
మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా పరిచయం అయిన సాయి ధరమ్‌ తేజ్‌.. వరుణ్‌ తేజ్‌ లు వరుసకు బావ బామ్మర్ధి అయినా కూడా స్నేహితుల మాదిరిగా చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరిద్దరు సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడంతో పాటు ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల కూడా వీరిద్దరు పెళ్లి విషయంలో ట్విట్టర్‌ వేదికగా మాట్లాడుకోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఇక మెగా వారసురాలిగా సినిమాలో రంగ ప్రవేశం చేసిన నిహారిక కూడా ఎక్కువగా మీడియాలో వార్తల్లో ఉంటూనే ఉంది. ఆమద్య సాయి ధరమ్‌ తేజ్‌ నిహారికలకు పెళ్లి జరుగనుంది అంటూ వార్తలు వచ్చాయి. ఆమె తనకు సోదరిలా అంటూ సాయి తేజ్‌ ప్రకటించడంతో ఆ వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడ్డట్లయ్యింది. మెగా వారసులుగా ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్‌ లో తమదైన ముద్రను వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాంటి ఈ ముగ్గురు ఇలా సింగిల్‌ ఫ్రేమ్‌ లో చాలా క్లోజ్‌ గా కనిపించడం మెగా ఫ్యాన్స్‌ కు కన్నుల వింధుగా ఉంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫొటోలో ముగ్గురు కూడా చాలా హ్యాపీ మూడ్‌ లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒక పార్టీలో తీసుకున్న ఫొటో అంటూ మెగా ఫ్యాన్స్‌ ఈ ఫొటోను తెగ షేర్‌ చేస్తున్నారు. వీరి బాండ్డింగ్‌ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం అంటూ మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు.
Tags:    

Similar News