ఆ టైంలో మేనల్లుడికి పవన్ ఏం చెప్పాడు?

Update: 2017-02-20 04:48 GMT
తనకు బెస్ట్ డెబ్యూ హీరోగా మా టీవీ వాళ్లు అవార్డు ఇచ్చినట్లు తన మావయ్య పవన్ కళ్యాణ్ చెప్పినపుడు ఆయన అన్న మాటల్ని తాను ఎప్పటికీ మరిచిపోనని అంటున్నాడు సాయిధరమ్ తేజ్. ఇంతకీ తేజుతో పవన్ అప్పుడేమన్నాడో.. ఈ విషయంతో పాటు ‘విన్నర్’ ఆడియో వేడుకలో సాయిధరమ్ ఇంకా ఏం చెప్పాడో.. అతడి మాటల్లోనే..

 ‘‘మాటీవీ అవార్డుకు ఎంపికయ్యానని పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్పాను. దానికాయన ఒకటే చెప్పారు. అవార్డులు గెలవడం.. విజయాలు సాధించడం కాదు.. ఒక ఫెయిల్యూర్ వచ్చినపుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నారన్న దాన్ని బట్టి మనం గెలిచామా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఆ విషయం నాకు ‘తిక్క’ సినిమా తర్వాత అర్థమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వకపోయినా సరే.. నా శ్రేయోభిలాషులు.. మెగా అభిమానులు అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మాటల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా.

విన్నర్ సినిమా విషయానికి వస్తే.. నా మార్కెట్ పరిధి చూడకుండా ఇంత భారీ సినిమా తీశారు. నా మీద ఇంత పెట్టుబడి పెడతారా అని నాకు సందేహాలు కలిగాయి. కానీ నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను ప్రొడ్యూస్ చేశారు. గోపీచంద్ ఒక అన్నయ్య లాగా నన్ను చూసుకున్నాడు. నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. అందరూ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ‘విన్నర్’ నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవతుందనుకుంటున్నా’’ అని సాయిధరమ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News