పివిపి పై ఆ రూమర్లలో నిజం లేదా?

Update: 2016-05-24 05:10 GMT
ఫిలిం నగర్‌ లో ఒక రోజు న్యూస్‌ అన్నదానిని రెండో రోజు రూమర్‌ అంటుంటారు. అదే ఇక్కడి స్టయిల్‌. ఇప్పుడు నిర్మాత పివిపి విషయంలో కూడా అలాంటి రూమరే కమ్‌ న్యూస్‌ ఒకటి వినిపిస్తోంది.

నిజానికి బ్రహ్మోత్సవం స్ట్రోక్‌ తగిలిన తరువాత.. ఆయన సినిమాలను ప్రొడ్యూస్‌ చేయడం మానేస్తారనేది మొన్నటి న్యూస్‌. శ్రీకాంత్‌ అడ్డాల.. వంశీ పైడిపల్లి వంటి దర్శకులు.. ఎంత ఖర్చులో సినిమాను తీయాలో తెలియక.. బోలెడంత పెట్టించేసి.. చివరకు హిట్టయిన ''ఊపిరి''కి లాభాలు రాక.. అలాగే బ్రహ్మోత్సవంతో అరకొర టేబుల్‌ ప్రాఫిట్‌ కూడా రాక ఆయన ఇబ్బంది పడ్డారని.. అందుకే సినిమా ప్రొడక్షన్‌ మానేసి.. చక్కగా ఫైనాన్సింగ్‌ చేసుకుంటారని టాక్‌ వచ్చింది. అయితే ఇందులో నిజం లేదు అంటున్నారు పివిపి ఆఫీస్‌ లో పనిచేసే వారు.

''మా సార్‌ చాలా స్ర్టాంగ్‌. ఆయన సినిమాలెందుకు మానేస్తారు? ఇకమీదట చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తారంతే'' అని చెప్పాడు ఓ సన్నిహితుడు. సర్లేండి.. జాగ్రత్తగా సినిమాలు తీయడం అంటే.. అశ్వినీదత్‌ లా ఎమ్మెస్‌ రాజు లా ఐదారేళ్ళకు ఓ సినిమాను తీయడమా మరి?
Tags:    

Similar News