హరీష్ సినిమాపై రూమర్లు నిజం కాదట

Update: 2018-06-25 15:30 GMT
ఇప్పటిదాకా టాలీవుడ్ లో స్క్రీన్ రైటర్లు గా పని చేసి డైరెక్టర్ గా మారిన వారిలో హరీష్ శంకర్ ఒకరు. కో-రైటర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా చేసిన తరువాత షాక్ సినిమా తో దర్శకుడిగా మారాడు హరీష్. అప్పటినుండి సంవత్సరానికో - రెండు సంవత్సరాలకో ఒక సినిమాతో మనల్ని పలకరిస్తూనే ఉన్నాడు. కానీ తన తరువాత సినిమా విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు.

సుబ్రమణ్యం ఫర్ సేల్ - దువ్వాడ జగన్నాధం లాంటి రెండు కమర్షియల్ మసాలా సినిమాలతో వచ్చిన తరువాత.. ఇప్పుడు హరీష్ ఒక మల్టీస్టారర్ తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాకపోతే గత కొన్నాళ్లుగా ఈ సినిమా అటకెక్కింది అంటూ రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమా క్యాన్సిల్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు న్యూస్ ప్రకారం ఈ సినిమా కాస్టింగ్ కొంత ఆలస్యం అవ్వడం కారణంగానే షూటింగ్ ఇంకా మొదలు కాలేదని చెప్తున్నారు.

ఒక హీరోగా నితిన్ ని ఇప్పటికే సెలెక్ట్ అయిపోయాడు. కాగా, మల్టీస్టారర్ కాబట్టి రెండో హీరో విషయంలోనే ఇంకా ఆలస్యం అవుతోంది. గత రెండు సినిమాలు క్రిటిక్స్ కు నచ్చకపోయినా కూడా.. కమర్షియల్ గా పర్వాలేదు అనిపించటం తో .. ఈ సినిమాపై అంచనాలు పెరగడం అంత కష్టం కాకపోవచ్చు. కాస్టింగ్ పూర్తయిన వెంటనే షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News