'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' కొత్త డేట్‌ ప్రకటించిన వర్మ

Update: 2019-03-19 06:00 GMT
రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రంకు సెన్సార్‌ సమస్యలు చుట్టు ముట్టాయి. మొదట ఈ చిత్రంను ఈనెల 22న విడుదల చేయాలని భావించారు. అయితే సినిమా విడుదలకు సెన్సార్‌ బోర్డు నుండి క్లియరెన్స్‌ రాలేదు. సెన్సార్‌ బోర్డు వారు ఎన్నికల ముందు ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. దాంతో సెన్సార్‌ బోర్డుపై కోర్టుకు కూడా వెళ్లబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ సమయంలోనే వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలకు కొత్త తేదీని ప్రకటించాడు.

వారం రోజులు ఆలస్యంగా అంటే ఇదే నెల 29వ తారీకున లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. 22వ తారీకు విడుదలకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ రానప్పుడు 29వ తారీకు మాత్రం ఎలా విడుదల అవుతుందని, అప్పటి వరకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఎలా వస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 29వ తారీకు వరకు వర్మ కోర్టుకు వెళ్లి అయినా సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకునే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.

మొత్తానికి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఎన్నికలకు ముందే విడుదల చేయాలని వర్మ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో చూడాలి. ఇదే సమయంలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను అడ్డుకునేందుకు టీడీపీ వారు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. 
Tags:    

Similar News