మరదళ్లతో సరే.. అత్తలతో వేగేదెలా?

Update: 2015-07-06 17:30 GMT
ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో ఒక అత్త ఇద్దరు మరదళ్లతో రొమాన్స్‌ని ఎలాంటి మొహమాటం లేకుండా లాగించేశాడు మెగాస్టార్‌. చాలా సినిమాల్లో అత్తకి తగ్గ అల్లుడిగా తన స్టామినాని చూపించాడు చిరు. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో పవన్‌ అదే ఫీట్‌ని రిపీట్‌ చేశాడు. అయితే ఈ చిత్రంలో అత్త సీరియస్‌ కాబట్టి, కేవలం మరదళ్లతోనే సరసమాడాడు పవన్‌.

అయితే ఈ రూటేదో బావుందే అనుకున్నాడో ఏమో ఇటీవలి కాలంలో అసలు మరదళ్లతో వ్యవహారమే లేని మహేష్‌ కూడా లైన్‌లోకొచ్చేశాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో అత్త కూతురు సమంతతో సరసమాడాడు. 'అతడు' లోనూ త్రిష మరదలే అన్నట్టు చూపిస్తారు కానీ కథలో ట్విస్టు వల్ల మరదలి వరుస కాదని ప్రూవ్‌ అవుతుందక్కడ. ఇప్పుడు ఏకంగా ఆరుగురు అత్తలు, ముగ్గురు మరదళ్లను పట్టేయడానికి రెడీ అవుతున్నాడని టాక్‌.

శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలోని 'బ్రహ్మూెత్సవం' చిత్రంలో మరదళ్లతో బోలెడంత వ్యవహారం ఉంది. పైగా ఆరుగురు అత్తలు కాపు కాచే చోట మరదళ్లతో రొమాన్స్‌ సాగించాల్సి రావడం ఠఫ్‌ టాస్క్‌. అయినా అన్నిటినీ హ్యాండిల్‌ చేయడానికి రెడీ అయిపోతున్నాడు ప్రిన్స్‌. మరదళ్లుగా కాజల్‌, సమంత, ప్రణీత ఫిక్సయిపోయారు కాబట్టి అందమైన అత్తల కోసం వెతికే పనిలో ఉన్నారిప్పుడు. రేవతి ఈ చిత్రంలో మహేష్‌కి తల్లిగా నటిస్తున్నారు.

    

Tags:    

Similar News