అప్పటి నుంచి హిరణ్యకశ్యప సెట్స్ పైకి

Update: 2020-01-23 05:56 GMT
రానా దగ్గుబాటి ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఒకవైపు 'హాథి మేరె సాథీ'.. మరోవైపు 'విరాటపర్వం' సినిమాలతో బిజీగా ఉంటూనే పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. అలాంటి వాటి లో పౌరాణిక చిత్రం 'హిరణ్యకశ్యప' ఒకటి. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు చాలాకాలంగా ప్రీప్రొడక్షన్ జరుగుతోంది.

ఈ సినిమాను 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతోంది. ఈ సినిమా కు భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయి కాబట్టి ముందే పక్కా స్క్రిప్ట్ తో పాటుగా షాట్ డివిజన్.. ఫోటోగ్రఫీ బ్లాక్స్ కూడా మందే రెడీ చేస్తున్నారట. ఈ సినిమాను సమ్మర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని సమాచారం.

'విరాటపర్వం' సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరుకు కంప్లీట్ అవుతుందని.. ఆ తర్వాత రానా 'హిరణ్యకశ్యప' పైనే పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తారని అంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ లో ఈమధ్య భారీ బడ్జెట్ సినిమాలు రాలేదు. ఆ లోటు తీర్చేలా ఈ సినిమా ను నిర్మిస్తారని అంటున్నారు.
Tags:    

Similar News