ఆ ఒక్కటీ అడక్కు.. అంటున్న రంభ

Update: 2017-01-22 04:02 GMT
బెజవాడ అమ్మాయి విజయలక్ష్మి.. తర్వాత రంభగా టాలీవుడ్ ని అలరించేసింది. జూనియర్ దివ్యభారతి అనే బ్రాండ్ తో మొదలుపెట్టి.. సొంత ట్యాలెంట్ తోనే బాలీవుడ్ లో కూడా సత్తా చాటేసింది. కెరీర్ మంచి టైంలో ఉండగానే.. ఇంద్రన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలకు తల్లి కూడా అయింది కానీ.. ఆ తర్వాత వీరి వివాహబంధం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది

కెనడాలో మొదలైన కాపురం.. అత్తింటి నుంచి వేధింపులతో ఇద్దరు పిల్లలతో మళ్లీ ఇండియాకి చేర్చాయని చెబుతోంది రంభ. మళ్లీ సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుందట. ఆలస్యమైనా ఛాన్సులు వస్తాయని అనుకుంటే అంచనాలు గురితప్పాయని చెప్పింది రంభ. పిల్లల కోసం భరణం కావాలంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. అయితే.. ఇది సొంతగానే ఈ నిర్ణయం తీసుకున్నానని.. కేవలం కోసమే భరణం అడిగానంటున్న ఈ మాజీ హీరోయిన్.. తన భర్త ఇంద్రన్ తో కలిసి జీవించాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది.

మధ్యలో అత్తారింటివారు.. పెద్ద కూతురును కిడ్నాప్ చేసిందంటూ రంభ పైనే కేసుపెట్టారు. నా కూతురును నేనే కిడ్నాప్ చేయడం ఏంటి అంటూ కన్నీళ్లు పెట్టేసుకుంటోంది రంభ. అయితే.. అప్పుడు ఇంద్రన్ తో విడిపోవాలని అనుకోవడం నిజమే అయినా.. ఇప్పుడు తనతో కలిసి జీవించాలని కోరుకుంటోందట. దీనికి కారణం అడిగితే మాత్రం.. తన మొదటి సినిమా స్టైల్ లో.. ఆ ఒక్కటీ అడక్కు అంటోంది. ప్రస్తుతం ఓ తెలుగు ఛానల్ లో చిన్నారుల డ్యాన్స్ షోకి స్నేహతో కలిసి జడ్జ్ గా చేస్తోంది రంభ అలియాస్ విజయ లక్ష్మి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News