చెర్రీ డబుల్ ధమాకా అంటగా..

Update: 2017-10-19 09:05 GMT
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ మొదటి నుంచి చరణ్ కేవలం సవత్సరానికి ఒక సినిమాను మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు. కొంత మంది స్టార్ హీరోలు ఏడాదికి రెండు సినిమాలను రిలీజ్ చేస్తున్నా కూడా చెర్రీ మాత్రం చాలా స్లోగా సినిమాలను చేస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఎలాగైనా రెండు సినిమాలను రిలీజ్ చెయ్యాలని ఈ మెగా హీరో పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ కానుంది. రంగస్థలం షూటింగ్ అయిపోగానే చెర్రీ మరొక సినిమాను సెట్స్ పైకి తేవడానికి రెడీ అయ్యాడు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రీసెంట్ గా ఒక కథను విన్న చెర్రీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో బోయపాటిని డిసెంబర్ కి రెడీగా ఉండమని చెప్పాడట చెర్రీ.

రంగస్థలం మెయిన్ షూటింగ్ అయిపోగానే డిసెంబర్ లో ఆ ప్రాజెక్టు ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే చరణ్ ఇంతకుముందు కొరటాల శివ దర్శకత్వంలో కూడా ఒక కథను ఒకే చేశాడు. దానికంటే ముందే బోయపాటి సినిమాను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నాడు చరణ్.
Tags:    

Similar News