మణిరత్నం మెగా మూవీ 'యోధ'

Update: 2017-05-21 07:22 GMT
రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినమా చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఫస్ట్ షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ మూవీని.. దసరానాటికి విడుదల చేయాలన్నది హీరో అండ్ మేకర్స్ ఆలోచన. ఇది ఎంతవరకూ సాధ్యమవతుందో చెప్పలేం కానీ.. ఇప్పుడు చెర్రీ తర్వాతి ప్రాజెక్టుపై ఓ క్లారిటీ వచ్చేస్తోంది.

సుకుమార్ తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తాడనే టాక్ గతంలో వినిపించింది. అయితే మణిరత్నం రీసెంట్ మూవీ చెలియా ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రాజెక్టును రద్దు చేసేసుకున్నారనే టాక్ వచ్చింది. కానీ వాస్తవం వేరుగా ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్- మణిరత్నం మూవీ ఆగిపోలేదని.. ప్రస్తుతం ఈ సినిమా స్టోరీని మణిరత్నం ఫైనల్ చేస్తున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గానే చెర్రీని కలిసి ఫుల్ లెంగ్త్ నెరేషన్ ఇచ్చారట మణిరత్నం. స్టోరీ లైన్ నుంచి అన్ని యాంగిల్స్ నచ్చేసిన చెర్రీ.. ఫైనల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేసుకోమని చెప్పాడట. సుకుమార్ తో మూవీ పూర్తి కాగానే ఇదే మొదలుపెడతారని అంటున్నారు. ఈ మూవికి యోధ అనే టైటిల్ పరిశీిలస్తున్నారు.

ఫ్లాప్ వచ్చినంత మాత్రాన ఆ దర్శకుడిని పక్కన పెట్టే టైపు కాదు రామ్ చరణ్. గోవిందుడు అందరివాడేలే చిత్రంతో కృష్ణవంశీకి.. బ్రూస్ లీతో శ్రీనువైట్లకు.. ధృవ అంటూ సురేందర్ రెడ్డికి.. ఫ్లాప్ ల తర్వాతే ఛాన్సులు ఇచ్చిన చరణ్.. ఇప్పుడు మణిరత్నంను చెలియా మూవీ ఫ్లాప్ కారణగా పక్కన పట్టే సమస్యే లేదని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News