వాళ్ల చేతులు తెగ నరకాలంటున్న రకుల్

Update: 2017-11-19 04:28 GMT
ఎప్పుడూ నవ్వుతూ.. సరదాగా మాట్లాడే రకుల్ ప్రీత్ కు కోపం వచ్చేసింది. అమ్మాయిల మీద జరిగే అఘాయిత్యాల గురించి స్పందించమన్నపుడు ఆమెలో ఆవేశం పెల్లుబికింది. అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లను జనాల మధ్యకు తీసుకొచ్చి శిక్షించాలని ఆమె అభిప్రాయపడింది. మన దేశంలో అత్యాచారాలు ఆగట్లేదని.. రోజు రోజుకూ పెరుగుతున్నాయని.. వీటికి అడ్డుకట్ట పడట్లేదని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.

కోర్టులో కేసులు ఏళ్లకు ఏళ్లకు సాగుతాయని.. ఏదో ఒకటి చేసి బయటికి వచ్చేయొచ్చన్న భావన దోషుల్లో ఉంటోందని.. ఇలాంటి ఆలోచనలు పోవాలంటే కఠినమైన చట్టాలను రూపొందించి అమలు చేయాలని ఆమె అభిప్రాయపడింది. మహిళలను వేధించిన వారి ముఖాల్ని దాచి ఉంచకూడదని.. అందరికీ చూపించాలని.. అరబ్ దేశాల్లో మాదిరి జనాల్లోకి తీసుకొచ్చి కఠినంగా శిక్షించాలని.. అక్కడి మాదిరే చేతులు తెగ నరకాలని రకుల్ అంది.

ఇక సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి స్పందిస్తూ.. ఇలాంటివి తాను చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నానని.. అలా వేధించే వారు ఉంటారో లేదో తనకు తెలియదని.. ఎందుకంటే తాను ఇప్పటిదాకా అలాంటి సమస్యను ఎదుర్కోలేదని రకుల్ తెలిపింది. సినీ పరిశ్రమపై మీడియా ఫోకస్ ఉంటుంది కాబట్టి దీని గురించి చర్చ నడుస్తోందని.. కానీ ఎన్నో ఆఫీసుల్లో మహిళలు అవస్థలు పడుతున్నారని.. దాని గురించి పట్టించుకునేదెవరని రకుల్ ఆవేదన వ్యక్తం చేసింది.
Tags:    

Similar News