సీక్వెల్ తీయడం ఈజీనే -రాజమౌళి

Update: 2016-10-25 05:28 GMT
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్. ఇప్పటివరకూ ఇక్కడ ఒక్క సీక్వెల్ కూడా ఆడిన దాఖలాలు లేవు. తొలి భాగాన్ని రిసీవ్ చేసుకున్నట్లు సెకండ్ పార్ట్ ను ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. కానీ ఈ ట్రెండ్ కు బాహుబలి బ్రేక్ వేయడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. బాహుబలి ది బిగినింగ్ సృష్టించబోయే సంచలనాల కంటే ఎక్కువగా.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకుందామనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.

అయితే బాహుబలి విషయంలో సీక్వెల్ చిత్రీకరణ చాలా ఈజీ అంటున్నాడు రాజమౌళి. 'మొదటి భాగం తీసే సమయంలో మాకు సబ్జెక్టుపై బోలెడంత నమ్మకం ఉంది. కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే అనుమానం ఉండేది. కానీ బాహుబలిని ప్రజలు ఆదరించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయానికి వస్తే.. ఆడియన్స్ కి కేరక్టర్స్ గురించి స్టోరీ గురించి తెలుసు. అందుకే రెండో భాగం బాహుబలి ది కంక్లూజన్ విషయంలో వేరే టెన్షన్స్ పెట్టుకోకుండా పిక్చరైజ్ చేయడం మాకు ఈజీగా మారిపోయింది' అని చెప్పాడు రాజమౌళి.

బాహుబలి ది కంక్లూజన్ లో కూడా దాదాపు బాహుబలిలో ఉన్న పాత్రలే ఉంటాయనే విషయం తేలిపోయింది. ప్రభాస్.. రానా.. అనుష్క.. తమన్నా.. సత్యరాజ్.. రమ్యకృష్ణలతో పాటు.. సుదీప్ రోల్ కూడా రెండో భాగంలో కీలకంగా మారనుందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News