2007 స్టోరీకి ఇప్పుడు రిజల్టు రానుంది

Update: 2016-05-29 06:49 GMT
రైటర్‌ రాజసింహ. అప్పుడెప్పుడో 2007లో ఒక కథను రాశాడు. దాదాపు 9 సంవత్సరాలు తరువాత ఇప్పుడు ఆ కథను సినిమాగా తీశాడు. అప్పటి నుండి ఆ కథను చాలామంది హీరోలు విని 'నో' చెప్పారు. రెండుసార్లయితే సినిమా మొదలై కూడా ఆగిపోయింది. మరి అప్పటి కథ ఇప్పుడు హిట్‌ కొడుతుందా?

ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో.. ఎక్కువ శాతం కథలు ఇదే వరుసలో ఉంటున్నాయి. ఎప్పుడో పదేళ్ళ క్రితం రాసుకున్న కథలను ఇప్పుడు తీస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సర్దార్‌ అయినా.. రజనీకాంత్‌ లింగా అయినా ఇదే వరుస. ఇలాంటి కథలు లేటెస్టు జనాలకు నచ్చలేదు మరి. అయితే ఇప్పుడు రైటర్‌ రాజసింహ మాత్రం.. ''ఒక్క అమ్మాయి తప్ప'' సినిమా ఖచ్చితంగా నేటి జనరేషన్ కు షాకింగ్‌ గా ఉంటుందని చెబుతున్నాడు. సినిమా అంతా చాలా అద్భుతంగా వచ్చిందట. సందీప్‌ కిషన్‌ అండ్‌ నిత్యా మీనన్‌.. తమ తమ పాత్రల్లో ఉతికి ఆరేశారని చెబుతున్నాడు. జూన్ 10న సినిమా విడుదలవుతున్న తరుణంలో మనోడు కాస్త టెన్స్ గా కాస్త హ్యాపీగా ఉన్నాడటలే.

ఈ సినిమా హిట్టవ్వడం దర్శకుడు రాజసింహకే కాదు.. హీరో సందీప్‌ కిషన్‌ కు కూడా చాలా అవసరం.
Tags:    

Similar News